Chattisgarh: సంకల్పం నెరవేరింది.. 21 ఏళ్ల తర్వాత గడ్డం తొలగింది.. ఇంతకీ అదేమిటో?
Chattisgarh: ఛత్తీస్గఢ్లో కొత్తగా ఏర్పాటైన మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ జిల్లా ప్రారంభోత్సవంతో మనేంద్రగఢ్ నివాసి రామశంకర్ గుప్తా సంకల్పం కూడా నెరవేరింది. ఆ సంకల్పం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మనేంద్రగఢ్ను జిల్లా చేసేంతవరకు గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేసిన రామశంకర్ గుప్తా.. 21 ఏళ్ల తర్వాత జిల్లా ఏర్పాటు కావడంతో గడ్డాన్ని తొలగించాడు. మనేంద్రగఢ్ జిల్లా అయ్యే వరకు, కలెక్టర్-ఎస్పీ బాధ్యతలు స్వీకరించే వరకు గడ్డం తీయబోనని గడ్డం పెంచాడు. శుక్రవారం ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మనేంద్రగఢ్లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
కొత్త జిల్లా మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ జిల్లా మొదటి కలెక్టర్ ధ్రువ్, ఎస్పీ తిలక్ రామ్ కోషిమా బాధ్యతలు స్వీకరించారు. దీంతో రామశంకర్ గుప్తా తన గడ్డం గీసుకున్నాడు. కొరియా జిల్లా నుంచి మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్లను విడదీసి కొత్త జిల్లాను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నామని రామశంకర్ గుప్తా తెలిపారు. 15 ఆగస్టు 2021న ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కొత్త జిల్లా మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ను ప్రకటించారు. ఆయన భావోద్వేగంతో రెండు మాటలు చెప్పారు. ‘కొత్త జిల్లా ఏర్పాటు కోసం చాలామంది పోరాడారు. వారిలో కొందరు మరణించారు’ అని రామశంకర్ గుప్తా తెలిపారు.
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
Delhi: ఢిల్లీలో ఆప్ సర్కారుకు కొత్త చిక్కు.. బస్సుల కొనుగోళ్లలో గోల్మాల్!
1999లో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనేంద్రగఢ్ను జిల్లాగా చేయాలనే డిమాండ్ తీవ్రమైంది. నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మనేంద్రగఢ్ జిల్లాను ఏర్పాటు చేసేంత వరకు తాను గడ్డం తీయను అని రామశంకర్ గుప్తా ప్రతిజ్ఞ చేశారు. రామశంకర్ సంకల్పం నెరవేరడానికి 21 ఏళ్లు పట్టింది. ఆగస్టు 15న జిల్లాను ప్రకటించిన తర్వాత ఆయన గడ్డం పూర్తి చేసుకున్నారు. దీంతో శుక్రవారం జిల్లాకేంద్రం ప్రారంభోత్సవంఅనంతరం గడ్డం గీయించుకున్నారు. కొరియా జిల్లాకు చెందిన రామశంకర్ గుప్తా ప్రసిద్ధ ఆర్టీఐ కార్యకర్త. 1999లో మనేంద్రగఢ్లోని గాంధీ చౌక్ వద్ద నిరసన ప్రదేశంలో గడ్డం తీయకూడదని ప్రతిజ్ఞ చేశారు. శుక్రవారం, అదే నిరసన ప్రదేశంలో డిమాండ్ నెరవేరడంతో గడ్డం తీయించుకున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొరియా జిల్లా నుంచి వేరుచేసి మనేంద్రగఢ్ – చిర్మిరి – భారత్పుర్ (ఎంసీబీ) ప్రాంతాలను 32వ జిల్లాగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో