Chattisgarh: సంకల్పం నెరవేరింది.. 21 ఏళ్ల తర్వాత గడ్డం తొలగింది.. ఇంతకీ అదేమిటో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chattisgarh: ఛత్తీస్గఢ్లో కొత్తగా ఏర్పాటైన మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ జిల్లా ప్రారంభోత్సవంతో మనేంద్రగఢ్ నివాసి రామశంకర్ గుప్తా సంకల్పం కూడా నెరవేరింది. ఆ సంకల్పం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మనేంద్రగఢ్ను జిల్లా చేసేంతవరకు గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేసిన రామశంకర్ గుప్తా.. 21 ఏళ్ల తర్వాత జిల్లా ఏర్పాటు కావడంతో గడ్డాన్ని తొలగించాడు. మనేంద్రగఢ్ జిల్లా అయ్యే వరకు, కలెక్టర్-ఎస్పీ బాధ్యతలు స్వీకరించే వరకు గడ్డం తీయబోనని గడ్డం పెంచాడు. శుక్రవారం ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మనేంద్రగఢ్లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
కొత్త జిల్లా మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ జిల్లా మొదటి కలెక్టర్ ధ్రువ్, ఎస్పీ తిలక్ రామ్ కోషిమా బాధ్యతలు స్వీకరించారు. దీంతో రామశంకర్ గుప్తా తన గడ్డం గీసుకున్నాడు. కొరియా జిల్లా నుంచి మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్లను విడదీసి కొత్త జిల్లాను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నామని రామశంకర్ గుప్తా తెలిపారు. 15 ఆగస్టు 2021న ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కొత్త జిల్లా మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ను ప్రకటించారు. ఆయన భావోద్వేగంతో రెండు మాటలు చెప్పారు. ‘కొత్త జిల్లా ఏర్పాటు కోసం చాలామంది పోరాడారు. వారిలో కొందరు మరణించారు’ అని రామశంకర్ గుప్తా తెలిపారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Delhi: ఢిల్లీలో ఆప్ సర్కారుకు కొత్త చిక్కు.. బస్సుల కొనుగోళ్లలో గోల్మాల్!
1999లో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనేంద్రగఢ్ను జిల్లాగా చేయాలనే డిమాండ్ తీవ్రమైంది. నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మనేంద్రగఢ్ జిల్లాను ఏర్పాటు చేసేంత వరకు తాను గడ్డం తీయను అని రామశంకర్ గుప్తా ప్రతిజ్ఞ చేశారు. రామశంకర్ సంకల్పం నెరవేరడానికి 21 ఏళ్లు పట్టింది. ఆగస్టు 15న జిల్లాను ప్రకటించిన తర్వాత ఆయన గడ్డం పూర్తి చేసుకున్నారు. దీంతో శుక్రవారం జిల్లాకేంద్రం ప్రారంభోత్సవంఅనంతరం గడ్డం గీయించుకున్నారు. కొరియా జిల్లాకు చెందిన రామశంకర్ గుప్తా ప్రసిద్ధ ఆర్టీఐ కార్యకర్త. 1999లో మనేంద్రగఢ్లోని గాంధీ చౌక్ వద్ద నిరసన ప్రదేశంలో గడ్డం తీయకూడదని ప్రతిజ్ఞ చేశారు. శుక్రవారం, అదే నిరసన ప్రదేశంలో డిమాండ్ నెరవేరడంతో గడ్డం తీయించుకున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొరియా జిల్లా నుంచి వేరుచేసి మనేంద్రగఢ్ – చిర్మిరి – భారత్పుర్ (ఎంసీబీ) ప్రాంతాలను 32వ జిల్లాగా ప్రకటించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
-
Salman Khan: గెలాక్సీ అపార్ట్మెంట్స్కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
-
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!