Char Dam Yatra: ఛార్ దామ్ యాత్రలో 91 మంది యాత్రికుల మృతి
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఛార్ దామ్ యాత్రలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. హిందువులు ఎంతో భక్తితో ఛార్ దామ్ యాత్రకు వస్తుంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్ చార్ ధామ్ పర్యటనలో భాగంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ యాత్రకు హిందూ యాత్రికులు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఛార్ దామ్ యాత్రకు వెళ్లాలననుకునే వారు చాలా మందే ఉంటారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది మాత్రం ఛార్ దామ్ యాత్రలో చాలా మరణాలు సంభవించాయి. యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి 91 మంది మరణించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ మంది గుండెపోటు, హై అల్టిట్యూడ్ సిక్ నెస్ కారణంగానే మరణించినట్లు ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ హెల్త్ శైలజా భట్ శుక్రవారం వెల్లడించారు. ప్రతీకూల వాతావరణం అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రభావం చూపింది. హిమాలయాల్లో చలి ప్రభావం, ఎత్తైన కొండల్ని ఎక్కడం ఆరోగ్యవంతులకే కష్టంగా ఉంటుంది. ఏమాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. చాలా వరకు సంభవించిన మరణాల్లో ఎక్కువ శాతం అనారోగ్యంతో బాధపడేవారే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఇదిలా ఉంటే తాజాగా ఛార్ దామ్ ఆరోగ్య సేవలు మునుపటితో పోలిస్తే మరింత బలోపేతం చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా 169 మంది వైద్యులను నియమించారు. మే 3న భక్తుల కోసం గంగోత్రి, యమునోత్రి యాత్రకు అనుమతి ఇవ్వడంతో ఛార్ దామ్ యాత్ర మొదలైంది. ఛార్ దామ్ యాత్రను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మే3న ప్రారంభించారు. మే 6న కేదార్ నాథ్ తెరుచుకోగా.. మే 8న బద్రీనాథ్ యాత్ర ప్రారంభం అయింది. మరోవైపు అనారోగ్యంగా ఉన్న భక్తులు రావద్దని ఉత్తరాఖండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్క్రీనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!