Char Dam Yatra: ఛార్ దామ్ యాత్రలో 91 మంది యాత్రికుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఛార్ దామ్ యాత్రలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. హిందువులు ఎంతో భక్తితో ఛార్ దామ్ యాత్రకు వస్తుంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్ చార్ ధామ్ పర్యటనలో భాగంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ యాత్రకు హిందూ యాత్రికులు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఛార్ దామ్ యాత్రకు వెళ్లాలననుకునే వారు చాలా మందే ఉంటారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది మాత్రం ఛార్ దామ్ యాత్రలో చాలా మరణాలు సంభవించాయి. యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి 91 మంది మరణించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ మంది గుండెపోటు, హై అల్టిట్యూడ్ సిక్ నెస్ కారణంగానే మరణించినట్లు ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ హెల్త్ శైలజా భట్ శుక్రవారం వెల్లడించారు. ప్రతీకూల వాతావరణం అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రభావం చూపింది. హిమాలయాల్లో చలి ప్రభావం, ఎత్తైన కొండల్ని ఎక్కడం ఆరోగ్యవంతులకే కష్టంగా ఉంటుంది. ఏమాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. చాలా వరకు సంభవించిన మరణాల్లో ఎక్కువ శాతం అనారోగ్యంతో బాధపడేవారే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఇదిలా ఉంటే తాజాగా ఛార్ దామ్ ఆరోగ్య సేవలు మునుపటితో పోలిస్తే మరింత బలోపేతం చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా 169 మంది వైద్యులను నియమించారు. మే 3న భక్తుల కోసం గంగోత్రి, యమునోత్రి యాత్రకు అనుమతి ఇవ్వడంతో ఛార్ దామ్ యాత్ర మొదలైంది. ఛార్ దామ్ యాత్రను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మే3న ప్రారంభించారు. మే 6న కేదార్ నాథ్ తెరుచుకోగా.. మే 8న బద్రీనాథ్ యాత్ర ప్రారంభం అయింది. మరోవైపు అనారోగ్యంగా ఉన్న భక్తులు రావద్దని ఉత్తరాఖండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్క్రీనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!