Champai Soren: జేఎంఎంకి చంపాయ్ సోరెన్ రాజీనామా..
- జేఎంఎంకి చంపాయ్ సోరెన్ గుడ్ బై..
- బీజేపీలో చేరుతానని ప్రకటించిన తర్వాతి రోజే రాజీనామా..
- జార్ఖండ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- ఆగస్టు 30న బీజేపీలో చేరే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champai Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) పార్టీకి రాజీనామా చేశారు. తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించిన ఆయన ఈ రోజు రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఆయన తన పార్టీకి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని పార్టీ దిక్కులేనిదిగా మారినందుకు తాను బలవంతంగా వైదగొగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్ ప్రజల తరుపున పోరాడుతూనే ఉంటానని ఆయన అన్నారు. “JMM నాకు ఒక కుటుంబం లాంటిది మరియు నేను పార్టీని వీడుతానని కలలో కూడా అనుకోలేదు. కానీ గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని విషయాలు నన్ను చాలా బాధపెట్టాయి మరియు ఈ కష్టమైన చర్య తీసుకోవలసి వచ్చింది” అని సోరెన్ అన్నారు.
Read Also: Mehbooba Mufti: నేను కాశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేయను.. మెహబూబా ముఫ్తీ షాకింగ్ నిర్ణయం.. కారణం ఇదే..
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
భూ కుంభకోణం కేసులో ఈడీ హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేసిన తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే, హేమంత్ సోరెన్కి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మళ్లీ ఆయన సీఎం అయ్యారు. అయితే, ఈ అధికార మార్పిడి సమయంలో తనను తీవ్రంగా అవమానించారనేది చంపాయ్ సోరెన్ ప్రధాన ఆరోపణ. తనకు తెలియకుడా కేబినెట్ మీటింగ్, ఎమ్మెల్యేల సమావేశాలు నిర్వహించారని తనను అవమానకరంగా పదవి నుంచి తొలగించినట్లు ఆయన ఆవేదన వ్యక్తి చేశారు. ఈ క్రమంలో బీజేపీకి ఆయన దగ్గరయ్యారు. ఆదివాసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని చెప్పారు. జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాలు సంతాల్ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాట్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన చంపాయ్ సోరెన్ జేఎంఎంని వీడటం ఆ పార్టీకి తీవ్రమైన దెబ్బగా పరిగణిస్తున్నారు. బీజేపీ తన పార్టీని డబ్బుతో విభజించాలని చూస్తోందని సీఎం హేమంత్ సోరెన్ విమర్శించారు. రాజీనామా చేసిన చంపాయ్ సోరెన్ ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
-
OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
-
OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
-
Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!