CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనకారులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. బుధవారం నుంచి నాలుగు సార్లు ఆహ్వానం పంపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం నుంచి చర్చల కోసం నాలుగు అధికారి ప్రతిపాదనల్ని పంపిందని తెలిపారు. నిరసనకారులకు అనువైన సమయంలో, ఎప్పుడైనా అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా పాల్గొంటారని వెల్లడించారు.
జేపీ నడ్డా కార్యాలంలో లేదా ఆయన నివాసంలో చర్చలు జరగొచ్చని, మాకు ప్రతిష్ట ముఖ్యం కాదని, జేపీ నడ్డా తాను ఇద్దరం చర్చలు జరుపుతామని జితేంద్ర సింగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న వరస చర్యల్లో ఇది ఒకటని చెప్పారు. అందరూ చర్చలకు రావాలని వినమ్రంగా కోరతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పేపర్ లీక్స్కు పాల్పడే వారిపై వేగంగా న్యాయంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ గురువారం ప్రకటించారు.
ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుంటే, తమ వద్దకే వచ్చి చర్చలు జరపాలని సీజీపీ నేత అభిజిత్ దీప్కే అన్నారు. జంతర్ మంతర్ వద్దకు కేంద్ర రావాలని అల్టిమేటం విధించారు. కేంద్రం డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయని చెబుతుందని, జంతర్ మంతర్ డోర్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయని ఆయన అన్నారు. సీజేపీ అధికారిక ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చలు జరగాలంటే తటస్థ వేదికలో లేదా జంతర్ మంతర్ వద్ద జరగాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు.
#WATCH | Delhi | On updated proposal for talks with Cockroach Janta Party, Union Minister Dr Jitendra Singh says, "The govt has sent four formal proposals for discussions with their representatives since last afternoon…This is a standing invitation to all our youth friends that… pic.twitter.com/PAQ6PbeNIa
— ANI (@ANI) July 23, 2026

