Bhagwant Mann: పంజాబ్ సీఎంకు చుక్కెదురు.. భగవంత్ మాన్ విదేశీ టూర్కు కేంద్రం నిరాకరణ
- పంజాబ్ సీఎంకు చుక్కెదురు
- భగవంత్ మాన్ విదేశీ టూర్కు కేంద్రం నిరాకరణ
- కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజం
పంజాబ్ ప్రభుత్వానికి-కేంద్రానికి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్ దేశాలకు వెళ్లేందుకు కేంద్ర అనుమతి కోరారు. కానీ అందుకు కేంద్రం నిరాకరించింది. ఇలా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఇది మూడోసారి. విదేశీ పర్యటనకు అనుమతి పొందడంలో మూడోసారి విఫలమయ్యారు. జనవరిలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే), ఇజ్రాయెల్ పర్యటనకు అనుమతి నిరాకరించబడింది. తాజాగా ఇప్పుడు మరోసారి కేంద్రం అడ్డుకుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్, యూకే పర్యటనకు ముందు గతంలో పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ను సందర్శించేందుకు భగవంత్ మాన్ అనుమతి కోరగా.. అప్పుడు కూడా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అనుమతి ఇవ్వలేదు. ఇలా వరుసగా మూడోసారి భగవంత్ మాన్కు నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Rohit Paudel: హృదయాలను గెలిచిన నేపాల్.. ఓటమిపై కెప్టెన్ రియాక్షన్ ఇదే..
కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ధ్వజమెత్తింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆప్ ఆరోపించింది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్రం విధించిన ఆంక్షలు దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు. వచ్చే నెలలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు పంజాబ్ ముఖ్యమంత్రి రెండు యూరోపియన్ దేశాల్లో ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సి ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Cryptocurrency Tragedy: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. క్రిప్టో నష్టాలతో యువకుడి ఆత్మహత్య
ప్రొటోకాల్ ప్రకారం… ముఖ్యమంత్రులు ఏదైనా అధికారిక విదేశీ ప్రయాణానికి వెళ్లే ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ అనుమతి పొందాలి. అయితే భగవంత్ మాన్కు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఎందుకు అనుమతి ఇవ్వలేదన్నది కారణం వెల్లడించలేదు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!