Bhagwant Mann: పంజాబ్ సీఎంకు చుక్కెదురు.. భగవంత్ మాన్ విదేశీ టూర్కు కేంద్రం నిరాకరణ
- పంజాబ్ సీఎంకు చుక్కెదురు
- భగవంత్ మాన్ విదేశీ టూర్కు కేంద్రం నిరాకరణ
- కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ప్రభుత్వానికి-కేంద్రానికి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్ దేశాలకు వెళ్లేందుకు కేంద్ర అనుమతి కోరారు. కానీ అందుకు కేంద్రం నిరాకరించింది. ఇలా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఇది మూడోసారి. విదేశీ పర్యటనకు అనుమతి పొందడంలో మూడోసారి విఫలమయ్యారు. జనవరిలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే), ఇజ్రాయెల్ పర్యటనకు అనుమతి నిరాకరించబడింది. తాజాగా ఇప్పుడు మరోసారి కేంద్రం అడ్డుకుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్, యూకే పర్యటనకు ముందు గతంలో పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ను సందర్శించేందుకు భగవంత్ మాన్ అనుమతి కోరగా.. అప్పుడు కూడా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అనుమతి ఇవ్వలేదు. ఇలా వరుసగా మూడోసారి భగవంత్ మాన్కు నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Rohit Paudel: హృదయాలను గెలిచిన నేపాల్.. ఓటమిపై కెప్టెన్ రియాక్షన్ ఇదే..
కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ధ్వజమెత్తింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆప్ ఆరోపించింది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్రం విధించిన ఆంక్షలు దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు. వచ్చే నెలలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు పంజాబ్ ముఖ్యమంత్రి రెండు యూరోపియన్ దేశాల్లో ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సి ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Cryptocurrency Tragedy: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. క్రిప్టో నష్టాలతో యువకుడి ఆత్మహత్య
ప్రొటోకాల్ ప్రకారం… ముఖ్యమంత్రులు ఏదైనా అధికారిక విదేశీ ప్రయాణానికి వెళ్లే ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ అనుమతి పొందాలి. అయితే భగవంత్ మాన్కు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఎందుకు అనుమతి ఇవ్వలేదన్నది కారణం వెల్లడించలేదు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!