Bhagwant Mann: పంజాబ్ సీఎంకు చుక్కెదురు.. భగవంత్ మాన్ విదేశీ టూర్కు కేంద్రం నిరాకరణ
- పంజాబ్ సీఎంకు చుక్కెదురు
- భగవంత్ మాన్ విదేశీ టూర్కు కేంద్రం నిరాకరణ
- కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ప్రభుత్వానికి-కేంద్రానికి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్ దేశాలకు వెళ్లేందుకు కేంద్ర అనుమతి కోరారు. కానీ అందుకు కేంద్రం నిరాకరించింది. ఇలా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఇది మూడోసారి. విదేశీ పర్యటనకు అనుమతి పొందడంలో మూడోసారి విఫలమయ్యారు. జనవరిలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే), ఇజ్రాయెల్ పర్యటనకు అనుమతి నిరాకరించబడింది. తాజాగా ఇప్పుడు మరోసారి కేంద్రం అడ్డుకుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్, యూకే పర్యటనకు ముందు గతంలో పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ను సందర్శించేందుకు భగవంత్ మాన్ అనుమతి కోరగా.. అప్పుడు కూడా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అనుమతి ఇవ్వలేదు. ఇలా వరుసగా మూడోసారి భగవంత్ మాన్కు నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Rohit Paudel: హృదయాలను గెలిచిన నేపాల్.. ఓటమిపై కెప్టెన్ రియాక్షన్ ఇదే..
కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ధ్వజమెత్తింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆప్ ఆరోపించింది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్రం విధించిన ఆంక్షలు దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు. వచ్చే నెలలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు పంజాబ్ ముఖ్యమంత్రి రెండు యూరోపియన్ దేశాల్లో ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సి ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Cryptocurrency Tragedy: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. క్రిప్టో నష్టాలతో యువకుడి ఆత్మహత్య
ప్రొటోకాల్ ప్రకారం… ముఖ్యమంత్రులు ఏదైనా అధికారిక విదేశీ ప్రయాణానికి వెళ్లే ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ అనుమతి పొందాలి. అయితే భగవంత్ మాన్కు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఎందుకు అనుమతి ఇవ్వలేదన్నది కారణం వెల్లడించలేదు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది.
తాజావార్తలు
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!