Naravane Book: నరవణే పుస్తకం రాహుల్గాంధీ చేతికి ఎలా వచ్చింది? కేంద్రం ఆరా
- నరవణే పుస్తకంపై దుమారం
- పుస్తకం రాహుల్గాంధీ చేతికి ఎలా వచ్చింది?
- పార్లమెంట్లో ప్రత్యక్షం కావడంపై కేంద్రం ఆరా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకం తీవ్ర దుమారం రేపుతోంది. గత వారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాపంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ మాట్లాడుతూ… మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’లోని ఆత్మకథకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. అంతే వెంటనే కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ మైక్ కట్ చేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది.

Also Read
మనోజ్ నరవణే మాజీ ఆర్మీ చీఫ్. భారత సైన్యంలో నాలుగు దశాబ్దాలు పాటు సేవలందించారు. 1962 తర్వాత జరిగిన అతిపెద్ద భారత్-చైనా ఘర్షణలను పర్యవేక్షించిన అధికారి. రిటైర్డ్ అయిన తర్వాత నరవణే ఆత్మకథ రాశారు. ఇందులో దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు పొందిపరిచారు. దీంతో ఈ పుస్తకం ప్రచురణకు కేంద్రం అనుమతించలేదు. అయినా కూడా ప్రచురించని పుస్తకం కాపీ రాహుల్ గాంధీకి చేతికి ఎలా వచ్చింది? అని కేంద్రం తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం ఈ విషయంపై కేంద్రం ఆరా తీస్తోంది.
పుస్తకంలో అసలేముంది?
మనోజ్ నరవణే.. మాజీ ఆర్మీ చీఫ్. తన జీవితంలో జరిగిన అంశాలను ఆత్మకథగా రాసుకున్నారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. 2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, తూర్పు లడఖ్లో సైనిక చర్యలు, ప్రభుత్వ-సైన్యం మధ్య నిర్ణయం తీసుకునే ప్రక్రియ, వ్యూహాత్మక ఆలోచనలతో సహా అతని సైనిక అనుభవాలను వివరించారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు డిసెంబర్ 2023లో మీడియాలో ప్రచురించబడ్డాయి. చైనాతో ఘర్షణ సమయంలో తలెత్తిన అంశాలను ప్రస్తావించారు. ఆ సమయంలో ‘నియంత్రణ’లో లేదని పేర్కొన్నారు. పుస్తకంలోని కొన్ని అంశాలు సున్నితంగా ఉన్నాయి. ఎందుకంటే.. జాతీయ భద్రత, వ్యూహాత్మక నిర్ణయాలు నేరుగా ప్రస్తావించబడ్డాయి. దీంతో అధికారికంగా ప్రచురణకు నోచుకోలేదు.
(ఎ) 1954 ఆర్మీ రూల్స్లోని సెక్షన్ 21 ప్రకారం..సర్వీస్ సబ్జెక్టులు, భద్రతా విషయాలపై ఎటువంటి విషయాలను ప్రచురించకూడదు. ఇక సైనిక సంబంధిత సమాచారాన్ని ప్రత్యక్షంగానీ.. పరోక్షంగానీ పత్రికలకు గానీ.. ఇతర ఏ రూపంలోనూ ప్రచురణ చేయకూడదు. ఇక కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పుస్తకం లేదా కథనాన్ని ప్రచురించకూడదు. ఇక సర్వీస్ సమాచారాన్ని కూడా ఎవరితో పంచుకోవడానికి వీలుండదు. ఇవన్నీ ఆర్మీ నిబంధనలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ అధికారికంగా ప్రచురణ జరగలేదు. రెండేళ్లుగా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం సమీక్షలో ఉండడంతో ప్రచురణ జరగలేదు.
అయితే గత వారం రాహుల్గాంధీ జాతీయవాదం అంశంపై పార్లమెంట్లో మాట్లాడుతూ. నరవణేకు సంబంధించిన అంశాలు ఒక మ్యాగజైన్లో ప్రచురితమైన అంశాలను లేవనెత్తారు. వెంటనే కేంద్రమంత్రులు అడ్డుతగిలారు. అంతేకాకుండా స్పీకర్ మైక్ కూడా కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన దిగారు. మరుసటి రోజే రాహుల్ గాంధీ నరవణే రాసిన పుస్తకాన్ని పార్లమెంట్ ఆవరణలో మీడియాకు చూపించారు. అవసరమైతే ప్రధాని మోడీకి అందిస్తానని చెప్పారు. అంటే ఈ పుస్తకం ఏప్రిల్, 2025కు ముందే ప్రచురణ జరిగినట్లుగా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ పుస్తకం ముద్రణపై కేంద్రం సీరియస్గా ఆరా తీస్తోంది.
What's Written In Gen. Naravane's Memoir That Scares The Life Out Of Modi Govt ❓❓ pic.twitter.com/afImest3iF
— Congress (@INCIndia) February 2, 2026
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!