LPG Crisis: ఎల్పీజీ సంక్షోభం మధ్య కిరోసిన్పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఎల్పీజీ సంక్షోభం మధ్య కిరోసిన్పై కేంద్రం కీలక నిర్ణయం..
- పీడీఎస్ వ్యవస్థ, బంకుల ద్వారా అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారత ఇంధనరంగంపై పడింది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్భందించడం, గల్ఫ్ దేశాల్లోని ఆయిల్, గ్యాస్ ఫీల్డ్లపై దాడి చేయడంతో ఆ ప్రాంతం నుంచి ప్రపంచానికి సరఫరా అయ్యే చమురు, గ్యాస్ ఎగుమతులపై ప్రభావం పడింది. ముఖ్యంగా, భారత్లో ఎల్పీజీ సంక్షోభం నెలకొంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇళ్లకు కిరోసిన్ సరఫరాను సులభతరం చేయడానికి ప్రభుత్వం పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనల్ని తాత్కాలికంగా సడలించింది.
Read Also: DMK manifesto: ‘‘పెన్షన్లు పెంపు, ఫ్రీ ల్యాప్లాప్లు, ఉచిత విద్యుత్’’.. డీఎంకే మానిఫెస్టో రిలీజ్..
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
మార్చి 29న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం… ప్రజలు ఇంధన కొరతను ఎదుర్కోకుండా పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్తో సహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద 60 రోజుల పాటు సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (SKO) తాత్కాలిక సరఫరాకు అనుమతి ఇచ్చింది.
పీడీఎస్ వ్యవస్థతో పాటు కొత్తగా తెచ్చిన మార్పుల వల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎంపిక చేసిన పెట్రోల్ పంపుల్లో కిరోసిన నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అనుమతి లభిస్తుంది. ఎంపిక చేసిన బంకుల్లో ప్రతీ అవుట్ లెట్ 5000 లీటర్ల కిరోసిన్ నిల్వ చేయనున్నారు. దీని కోసం ప్రతీ జిల్లాకు గరిష్టంగా 2 పెట్రోల్ పంపుల్ని కేటాయిస్తారు. వేగవంతమైన పంపిణీని సులభతరం చేయడానికి డీలర్లు, రవాణాదారులకు కొన్ని లైసెన్సింగ్ అవసరాల నుండి కూడా మినహాయింపు ఇవ్వబడింది. ఈ కిరోసిన్ వంట, దీపాలు వెలిగించడం వంటి గృహ వినియోగానికి మాత్రమే సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!