Ranya Rao: రంగంలోకి సీబీఐ.. రన్యారావు పెళ్లికి ఖరీదైన గిఫ్ట్లు.. వీడియో పరిశీలిస్తున్న అధికారులు
- రన్యారావు కేసులో రంగంలోకి దిగిన సీబీఐ
- రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరు
- పెళ్లి వీడియో పరిశీలిస్తున్న సీబీఐ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇప్పటి దాకా డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ అధీనంలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించింది.
రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనుక.. ప్రముఖ రాజకీయ నాయకులు హస్తం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రన్యారావుకు మూడు నెలల క్రితమే ప్రముఖ ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరినే వివాహం చేసుకుంది. కానీ అతడితో సరైన సంబంధాలు లేవన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి మాత్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర్ సహా పలువురు వీవీఐపీలు హాజరయ్యారు. అంతేకాకుండా రన్యారావుకి ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆ దిశగా ఫోకస్ పెట్టింది. రన్యారావు పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారు. ఖరీదైన గిఫ్ట్లు తీసుకొచ్చింది ఎవరు? అన్న కోణంలో పెళ్లి నాటి వీడియోలను.. మండపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో అధికారులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
ఇది కూడా చదవండి: ITBP: స్పోర్ట్స్ బాగా ఆడుతారా? ఈ కానిస్టేబుల్ జాబ్స్ మీకోసమే.. 10th పాసైతే చాలు
రన్యారావు.. గతేడాది నుంచి అనేకమార్లు దుబాయ్ వెళ్లింది. ప్రతి ట్రిప్లో భారీగా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. కానీ ఎన్నడూ పట్టుబడలేదు. వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకుని బయటకు వచ్చేసింది. రన్యారావు తండ్రి రామచంద్రరావు కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అయితే రన్యారావు తన తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని ఎయిర్పోర్టు నుంచే బయటకు వచ్చేసినట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: KCR : అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
అయితే రన్యారావు పాపం పండి.. మార్చి 3న మాత్రం డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. ఆ సమయంలో ఆమె దగ్గర నుంచి రూ.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు.. తొడల దగ్గర స్టిక్కర్లు అంటించుకున్నట్లు కనిపెట్టారు. ఇక ఆమె ఇంటి దగ్గర సోదా చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఆమె స్నేహితుడు తరుణ్ రాజును అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఆమె భర్త జతిన్ హుక్కేరిపై కూడా దృష్టి పెట్టారు. ఇతడు కూడా పలుమార్లు దుబాయ్కి వెళ్లినట్లు గుర్తించారు. అసలు ఆమె వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయి. వీఐపీ ప్రొటోకాల్ ఎలా ఉపయోగించుకోగలిగింది అనే అంశంపై సీబీఐ కూపీలాగుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: పరుగులు పెడుతున్న పసిడి.. రూ. 490 పెరిగిన తులం గోల్డ్ ధర.. రూ. 2 వేలు పెరిగిన కిలో వెండి ధర
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..