Ranya Rao: రంగంలోకి సీబీఐ.. రన్యారావు పెళ్లికి ఖరీదైన గిఫ్ట్లు.. వీడియో పరిశీలిస్తున్న అధికారులు
- రన్యారావు కేసులో రంగంలోకి దిగిన సీబీఐ
- రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరు
- పెళ్లి వీడియో పరిశీలిస్తున్న సీబీఐ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇప్పటి దాకా డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ అధీనంలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించింది.
రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనుక.. ప్రముఖ రాజకీయ నాయకులు హస్తం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రన్యారావుకు మూడు నెలల క్రితమే ప్రముఖ ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరినే వివాహం చేసుకుంది. కానీ అతడితో సరైన సంబంధాలు లేవన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి మాత్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర్ సహా పలువురు వీవీఐపీలు హాజరయ్యారు. అంతేకాకుండా రన్యారావుకి ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆ దిశగా ఫోకస్ పెట్టింది. రన్యారావు పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారు. ఖరీదైన గిఫ్ట్లు తీసుకొచ్చింది ఎవరు? అన్న కోణంలో పెళ్లి నాటి వీడియోలను.. మండపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో అధికారులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
ఇది కూడా చదవండి: ITBP: స్పోర్ట్స్ బాగా ఆడుతారా? ఈ కానిస్టేబుల్ జాబ్స్ మీకోసమే.. 10th పాసైతే చాలు
రన్యారావు.. గతేడాది నుంచి అనేకమార్లు దుబాయ్ వెళ్లింది. ప్రతి ట్రిప్లో భారీగా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. కానీ ఎన్నడూ పట్టుబడలేదు. వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకుని బయటకు వచ్చేసింది. రన్యారావు తండ్రి రామచంద్రరావు కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అయితే రన్యారావు తన తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని ఎయిర్పోర్టు నుంచే బయటకు వచ్చేసినట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: KCR : అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
అయితే రన్యారావు పాపం పండి.. మార్చి 3న మాత్రం డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. ఆ సమయంలో ఆమె దగ్గర నుంచి రూ.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు.. తొడల దగ్గర స్టిక్కర్లు అంటించుకున్నట్లు కనిపెట్టారు. ఇక ఆమె ఇంటి దగ్గర సోదా చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఆమె స్నేహితుడు తరుణ్ రాజును అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఆమె భర్త జతిన్ హుక్కేరిపై కూడా దృష్టి పెట్టారు. ఇతడు కూడా పలుమార్లు దుబాయ్కి వెళ్లినట్లు గుర్తించారు. అసలు ఆమె వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయి. వీఐపీ ప్రొటోకాల్ ఎలా ఉపయోగించుకోగలిగింది అనే అంశంపై సీబీఐ కూపీలాగుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: పరుగులు పెడుతున్న పసిడి.. రూ. 490 పెరిగిన తులం గోల్డ్ ధర.. రూ. 2 వేలు పెరిగిన కిలో వెండి ధర
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!