Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి యువతను అక్రమంగా పంపిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. దర్యాప్తు సంస్థ మార్చిలో టోటల్ కన్సల్టెన్సీ, దాని యజమానులతో సహా కొంతమందిపై కేసు నమోదు చేసింది. దీని తర్వాత ఏడు రాష్ట్రాల్లోని 10 ప్రదేశాలలో కూడా దాడులు జరిగాయి. నేరపూరిత కుట్ర, మోసం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద ఏజెన్సీ ఈ విషయంలో కేసు నమోదు చేసింది.
రష్యాలోని కొన్ని ప్రాంతాల నుండి కొన్ని వీడియోలు వెలువడ్డాయి. అందులో కొంతమంది కన్సల్టెన్సీ వ్యక్తులు ఉద్యోగాల పేరుతో భారతీయులను రష్యాకు ఆహ్వానిస్తున్నారు. ఈ వ్యక్తులు ఉద్యోగం పేరుతో యువతను పిలిచేవారు. కానీ అక్కడికి చేరుకోగానే వారిని వార్ జోన్లోకి నెట్టేవారు. విషయం తెలియగానే సీబీఐ దర్యాప్తు ప్రారంభించి ఇప్పుడు తొలి అరెస్టు చేసింది. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి నిందితులను సీబీఐ అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే అరెస్టయిన నిందితుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ కేసులో మరికొంత మందిని సీబీఐ త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
Read Also:DC vs RR: రాజస్థాన్ పై ఢిల్లీ విక్టరీ.. సంజూ శ్రమ వృధా
మొదట రష్యాలో అవకాశాలతో కన్సల్టెన్సీ ద్వారా యువతను ఆకర్షించి, ఆపై వారి పాస్పోర్ట్లను జప్తు చేసి, రష్యా-ఉక్రెయిన్ వార్ జోన్లోకి నెట్టారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక వీసా కన్సల్టెన్సీ కంపెనీలు, వాటి యజమానులు, ఏజెంట్లు సీబీఐ రాడార్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యక్తులు సోషల్ మీడియా, స్థానిక పరిచయాలు, ఏజెంట్ల ద్వారా యువతకు చేరువయ్యారు. అధిక జీతాలు, ఉద్యోగాల కోసం తప్పుడు వాగ్దానాలతో రష్యాకు తీసుకెళ్లేవారు. సోషల్ మీడియా ఛానెల్లు, స్థానిక పరిచయాలు, ఏజెంట్ల ద్వారా అధిక జీతంతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలతో యువతను రష్యాకు రప్పించిన 35 ఉదంతాలను సీబీఐ కనుగొంది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం జరుగుతోంది. రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా యుద్ధంలో ఘోరంగా నష్టపోయాయి. 2022 ఫిబ్రవరి 24న రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు కూడా అమరులయ్యారు.
Read Also:KCR : కాంగ్రెస్ ఇస్తానన్న 4 వేల పెన్షన్ వచ్చిందా.. నిరుద్యోగ భృతి వచ్చిందా
తాజావార్తలు
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి