Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి యువతను అక్రమంగా పంపిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. దర్యాప్తు సంస్థ మార్చిలో టోటల్ కన్సల్టెన్సీ, దాని యజమానులతో సహా కొంతమందిపై కేసు నమోదు చేసింది. దీని తర్వాత ఏడు రాష్ట్రాల్లోని 10 ప్రదేశాలలో కూడా దాడులు జరిగాయి. నేరపూరిత కుట్ర, మోసం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద ఏజెన్సీ ఈ విషయంలో కేసు నమోదు చేసింది.
రష్యాలోని కొన్ని ప్రాంతాల నుండి కొన్ని వీడియోలు వెలువడ్డాయి. అందులో కొంతమంది కన్సల్టెన్సీ వ్యక్తులు ఉద్యోగాల పేరుతో భారతీయులను రష్యాకు ఆహ్వానిస్తున్నారు. ఈ వ్యక్తులు ఉద్యోగం పేరుతో యువతను పిలిచేవారు. కానీ అక్కడికి చేరుకోగానే వారిని వార్ జోన్లోకి నెట్టేవారు. విషయం తెలియగానే సీబీఐ దర్యాప్తు ప్రారంభించి ఇప్పుడు తొలి అరెస్టు చేసింది. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి నిందితులను సీబీఐ అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే అరెస్టయిన నిందితుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ కేసులో మరికొంత మందిని సీబీఐ త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
Read Also:DC vs RR: రాజస్థాన్ పై ఢిల్లీ విక్టరీ.. సంజూ శ్రమ వృధా
మొదట రష్యాలో అవకాశాలతో కన్సల్టెన్సీ ద్వారా యువతను ఆకర్షించి, ఆపై వారి పాస్పోర్ట్లను జప్తు చేసి, రష్యా-ఉక్రెయిన్ వార్ జోన్లోకి నెట్టారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక వీసా కన్సల్టెన్సీ కంపెనీలు, వాటి యజమానులు, ఏజెంట్లు సీబీఐ రాడార్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యక్తులు సోషల్ మీడియా, స్థానిక పరిచయాలు, ఏజెంట్ల ద్వారా యువతకు చేరువయ్యారు. అధిక జీతాలు, ఉద్యోగాల కోసం తప్పుడు వాగ్దానాలతో రష్యాకు తీసుకెళ్లేవారు. సోషల్ మీడియా ఛానెల్లు, స్థానిక పరిచయాలు, ఏజెంట్ల ద్వారా అధిక జీతంతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలతో యువతను రష్యాకు రప్పించిన 35 ఉదంతాలను సీబీఐ కనుగొంది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం జరుగుతోంది. రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా యుద్ధంలో ఘోరంగా నష్టపోయాయి. 2022 ఫిబ్రవరి 24న రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు కూడా అమరులయ్యారు.
Read Also:KCR : కాంగ్రెస్ ఇస్తానన్న 4 వేల పెన్షన్ వచ్చిందా.. నిరుద్యోగ భృతి వచ్చిందా
తాజావార్తలు
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!