NEET Paper leak case: పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి అరెస్ట్.. బీహార్లో ఇద్దరు అరెస్ట్
- పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి అరెస్ట్
- బీహార్లో ఇద్దరు అరెస్ట్
- ఎగ్జామ్కు ముందు రోజు ఎగ్జామ్ పేపర్.. కీ అందించినట్లుగా గుర్తింపు
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి అరెస్ట్గా బీహార్లో ఇద్దరు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తొలి అరెస్టులు చూపించింది. పాట్నాకు చెందిన మనీష్ ప్రకాష్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.
పాట్నా పాఠశాలలో విద్యార్థులకు నిందితులిద్దరూ వసతి కల్పించారని, లీకైన ప్రశ్నపత్రాలను ఇచ్చారని గుర్తించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన ఆరు కేసులను సీబీఐ విచారిస్తోంది. ఆరు కేసుల్లో ఒక్కొక్కటి బీహార్, గుజరాత్, మహారాష్ట్రలకు చెందినవి కాగా మూడు రాజస్థాన్కు చెందినవి.
Also Read
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
ఇది కూడా చదవండి: Lok Sabha Deputy Speaker: లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు కూడా ఎన్డీయేకే.. ప్రతిపక్షాలకు దెబ్బ..
నీట్ పరీక్షకు ఒక రోజు ముందు మే 4న బీహార్లోని పాట్నాలోని లెర్న్ ప్లే స్కూల్తో సంబంధం ఉన్న బాలుర హాస్టల్లో అశుతోష్ సహాయంతో మనీష్ ప్రకాష్ అభ్యర్థులకు లీక్ అయిన పేపర్లు, సమాధానాల ‘కీ’ను ఇచ్చినట్లు సీబీఐ ఆరోపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాఠశాలను ఒక రాత్రికి బుక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
NEET-UG 2024లో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై CBI ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మంత్రిత్వ శాఖ దర్యాప్తును కేంద్ర ఏజెన్సీకి అప్పగించిన ఒక రోజు తర్వాత ఆదివారం నిరసనకు దిగిన విద్యార్థుల్లో ఒక వర్గం సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో MBBS, BDS, ఆయుష్ మరియు ఇతర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా NEET-UG నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్ష మే 5న విదేశాల్లో 14 సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Bihar: బీహార్లో కూలిన మరో బ్రిడ్జి.. 4కి చేరిన సంఖ్య
తాజావార్తలు
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!