RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
- ఆర్జీ కర్ కేసులో కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం..
- మళ్లీ దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశం..
- సాక్ష్యాలు నాశనం చేశారనే ఆరోపణల పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar Case: దేశాన్ని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2024లో జరిగిన ఈ దారుణ ఘటనపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేశారనే ఆరోపణలు, ఘటన తీవ్రతను తగ్గించి చూపారనే వాదనల నేపథ్యంలో మళ్లీ కొత్త దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది.
Read Also: Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపణలపై పున:దర్యాప్తు చేసేందుకు సీబీఐతో ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2024 ఆగస్టు 09 తేదీ రాత్రి ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోపల ఒక యువ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లో కూడిన ధర్మాసనం, కొత్తగా విచారణ చేసే సిట్కు సీబీఐ జాయింట్ డైరెక్టర్(తూర్పు జోన్) నాయకత్వం వహిస్తారని చెప్పింది. మరో ఇద్దరు సభ్యుల్ని 48 గంటల్లో ఖరారు చేయాలని ఆదేశించింది.
రాత్రి మహిళా వైద్యురాలు భోజనం చేసినప్పటి నుంచి ఆమె అంత్యక్రియలు జరిగే వరకు జరిగిన సంఘటలను పరిశీలించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ సంఘటనలో తీవ్రతను తగ్గించడానికి సాక్ష్యాలు నాశనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్ని సిట్ పరిశీలిస్తుందని న్యాయస్థానం చెప్పింది. జూన్ 25న ఈ విషయంపై మళ్లీ విచారిస్తామని వెల్లడించింది. ఈలోగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్ను కోరింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం ఈ ఘటనలో ఒకరి కన్నా ఎక్కువ మంది ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!