RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
- ఆర్జీ కర్ కేసులో కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం..
- మళ్లీ దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశం..
- సాక్ష్యాలు నాశనం చేశారనే ఆరోపణల పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar Case: దేశాన్ని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2024లో జరిగిన ఈ దారుణ ఘటనపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేశారనే ఆరోపణలు, ఘటన తీవ్రతను తగ్గించి చూపారనే వాదనల నేపథ్యంలో మళ్లీ కొత్త దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది.
Read Also: Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
Also Read
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపణలపై పున:దర్యాప్తు చేసేందుకు సీబీఐతో ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2024 ఆగస్టు 09 తేదీ రాత్రి ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోపల ఒక యువ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లో కూడిన ధర్మాసనం, కొత్తగా విచారణ చేసే సిట్కు సీబీఐ జాయింట్ డైరెక్టర్(తూర్పు జోన్) నాయకత్వం వహిస్తారని చెప్పింది. మరో ఇద్దరు సభ్యుల్ని 48 గంటల్లో ఖరారు చేయాలని ఆదేశించింది.
రాత్రి మహిళా వైద్యురాలు భోజనం చేసినప్పటి నుంచి ఆమె అంత్యక్రియలు జరిగే వరకు జరిగిన సంఘటలను పరిశీలించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ సంఘటనలో తీవ్రతను తగ్గించడానికి సాక్ష్యాలు నాశనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్ని సిట్ పరిశీలిస్తుందని న్యాయస్థానం చెప్పింది. జూన్ 25న ఈ విషయంపై మళ్లీ విచారిస్తామని వెల్లడించింది. ఈలోగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్ను కోరింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం ఈ ఘటనలో ఒకరి కన్నా ఎక్కువ మంది ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!