IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 గ్రాండ్ ఫైనల్ కు రంగం సిద్ధం.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఉత్కంఠభరిత పోరు
- అందరి అంచనాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వైపే.
- చివరకు AI టూల్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరునే విజేతగా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Winner: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 గ్రాండ్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్-1లో ఇప్పటికే తలపడగా, ఆ మ్యాచ్ లో ఆర్టీసీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, పంజాబ్ కింగ్స్ ఆ పరాజయాన్ని తట్టుకుని క్వాలిఫయర్-2లో ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ పై గెలిచి ఫైనల్ కి చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ బలంగా కనిపిస్తుండగా, రాజత్ పటీదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు కూడా దూకుడుగా ఉంది.
ఇకపోతే, ఈ హై వోల్టేజ్ ఫైనల్ పై అభిమానుల అభిప్రాయాలు రెండు వైపులా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న AI ప్లాట్ ఫార్ములు గ్రోక్ (Grok), జెమినీ (Gemini), చాట్ జిపిటి (ChatGPT) మూడు కూడా విజేతగా ఒకే జట్టునే చూపిస్తున్నాయి. మరి ఈ AI ప్లాట్ ఫార్ములు ఏ జట్టును ఎందుకు విజేతలుగా ఎంచుకుందో ఒకసారి చూద్దామా..
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
Read Also: IPL 2025 Final: సాయంత్రం 6 గంటలకే ఐపీఎల్ ముగింపు వేడుకలు..
చాట్జిపిటి అంచనా:
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబి విజయాలను పరిగణనలోకి తీసుకుని, ఫైనల్ విజయానికి బెంగళూరు బలంగా ఉందని తెలిపింది. అయితే శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కూడా పటిష్టంగా ఉండటంతో ఈ ఫైనల్ పోరు చాలా కష్టం అని చెప్పింది. చివరికి మాత్రం ఆర్సీబి స్వల్ప తేడాతో గెలుస్తుందనే అభిప్రాయాన్ని చాట్జిపిటి తెలిపింది.
గ్రోక్ అంచనా:
గ్రోక్ అంచనా ప్రకారం.. ఆర్సీబి బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో దుమ్మురేపుతోందని గ్రోక్ అభిప్రాయపడింది. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో జోష్ హేజిల్వుడ్ (11 మ్యాచ్ల్లో 21 వికెట్లు), అలాగే మరో బౌలర్ సూయాష్ శర్మ బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తుండగా.. మరోవైపు విరాట్ కోహ్లీ 55.81 సగటుతో 614 పరుగులు చేయగా, మరో స్టార్ బాట్స్మెన్ ఫిల్ సాల్ట్ భీకర ఫామ్ లో ఉన్నారు.
Read Also: Deepika Padukone: ‘స్పిరిట్’ కోసం తగ్గని దీపిక.. అల్లు అర్జున్ కోసం ఎందుకు తగ్గింది?
జెమినీ అంచనా:
మరో AI జెమినీ అభిప్రాయం ప్రకారం.. రెండు జట్లు తమ తొలి టైటిల్ కోసం పోటీపడుతుండగా.. ఆర్సీబికి స్వల్ప ఆధిక్యత ఉన్నట్లు అంచనా వేసింది. కానీ, ఫైనల్ రోజున ఆటతీరు, టాస్, వాతావరణ పరిస్థితులు కూడా ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని తెలిపింది.
మొత్తంగా AI టూల్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరునే విజేతగా సూచించాయి. అయినా కూడా పంజాబ్ కింగ్స్ పుంజుకోవడం, శ్రేయాస్ అయ్యర్ అద్భుత నాయకత్వం మ్యాచ్ను ఊహించలేని మలుపులకు తీయవచ్చు. కాబట్టి అభిమానులకు ఈ ఫైనల్ మ్యాచ్ మైదానంలో యుద్ధంలా ఉండనుంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!