C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ప్రజలు ఎవర్ని సీఎంగా కోరుకుంటున్నారు..?

  • మహారాష్ట్ర ఎన్నికలపై అంతా ఆసక్తి..
  • సీఎంగా ఏక్‌నాథ్ షిండే వైపే మహారాష్ట్ర ప్రజలు..
  • సీఓటర్ సర్వేలో కీలక ఫలితాలు..
C Voter Survey Maharashtra

C Voter Survey Maharashtra

C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొంది. హర్యానాలో ఘన విజయం సాధించిన బీజేపీ, మరోసారి మహారాష్ట్రలో కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి( బీజేపీ-ఎన్సీపీ అజిత్ పవార్- శివసేన ఏక్‌నాథ్ షిండే), మరోవైపు ‘మహా వికాస్ అఘాడీ’( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఉద్ధవ్ ఠాక్రే) కూటమి పోటీ పడుతున్నాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

రెండు కూటములు కూడా తమ ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఎన్నికల గెలుపు తర్వాతే ఓ క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ‘‘సీఓటర్ సర్వే’’ మహారాష్ట్ర ప్రజలు ఎవరిని సీఎంగా కోరుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ చివరి రోజు ఈ ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే వైపే మహారాష్ట్ర ఓటర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రెండో స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే, మూడో స్థానంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. శరద్ పవార్ 4వ స్థానంలో, అజిత్ పవార్ 5వ స్థానంలో ఉన్నారు.

×
×
Ad

Read Also: South Central Railway: తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్యాసింజర్‌కి రూ.25 వేల పరిహారం.. కారణం?

ప్రాంతాల వారీగా ప్రజలు ఎవర్ని సీఎంగా కోరుకుంటున్నారు..?

ఏకనాథ్ షిండే
ముంబై – 25.3 శాతం
కొంకణ్ – 36.7 శాతం
మరాఠ్వాడా – 27.4 శాతం
ఉత్తర మహారాష్ట్ర – 33.1 శాతం
విదర్భ – 25.1 శాతం
పశ్చిమ మహారాష్ట్ర – 22.8 శాతం
సగటు – 27.5 శాతం

ఉద్ధవ్ ఠాక్రే
ముంబై – 23.2 శాతం
కొంకణ్ – 26.3 శాతం
మరాఠ్వాడా – 22.3 శాతం
ఉత్తర మహారాష్ట్ర – 23.3 శాతం
విదర్భ – 23.2 శాతం
పశ్చిమ మహారాష్ట్ర – 20.7 శాతం
సగటు – 22.9 శాతం

దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై – 14.8 శాతం
కొంకణ్ – 10.4 శాతం
విదర్భ – 13.7 శాతం
సగటు – 10.8 శాతం

అజిత్ పవార్
ముంబై – 0.8 శాతం
కొంకణ్ – 0.9 శాతం
మరాఠ్వాడా – 2.4 శాతం
ఉత్తర మహారాష్ట్ర – 2.5 శాతం
విదర్భ – 2.4 శాతం
పశ్చిమ మహారాష్ట్ర – 6.6 శాతం
సగటు – 3.1 శాతం