Sanjay Raut: అమిత్ షా మళ్లీ హోంమంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడింది..
- అమిత్ షా హోమంత్రి కావడం దేశానికి ప్రమాదం..
- జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులకు బాధ్యత ఎవరిది..?
- ప్రతిపక్షాలను ఫినిష్ చేసే పనిలో షా..
- శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. బుధవారం రౌత్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్లోని టెర్రర్ దాడులపై అమిత్ షాని టార్గెట్ చేశారు. అమిత్ షా ప్రతిపక్షాలను తుడిచిపెట్టే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. షా హోంమంత్రిగా ఉన్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్లో అత్యధిక సంఖ్యలో భద్రతా బలగాలు, పౌరులు మరణించారని ఆరోపించారు. ఢిల్లీలో మోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే 10 మంది మరణించారని, హోంమంత్రి తీవ్రవాదుల్ని నిర్మూలించే పని చేస్తే దేశానికి మేలు చేస్తుందని రౌత్ చెప్పారు.
Read Also: UP Crime: “నన్ను ప్రేమించి వేరేవాడితో అక్రమ సంబంధం”.. ప్రియురాలి తలనరికి దారుణ హత్య..
Also Read
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
బీహార్, ఏపీ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులు ఇద్దరూ అమిత్ షా రాజీనామా కోరాలని అన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కాన్వాయ్పై కూడా దాడి చేశారని, మోడీ ప్రభుత్వంలో మళ్లీ అమిత్ షా హోం మంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడిందని అన్నారు. దీనికి ముందు జమ్మూ కాశ్మీర్ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రాణాలు పోతున్నాయని, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి బాధ్యులెవరని ఠాక్రే ప్రశ్నించారు. నేను దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని, ఎన్డీయే ప్రభుత్వ భవిష్యత్ గురించి కాదని అన్నారు.
ఆదివారం జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. మంగళవారం కథువా, దోడా ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. రియాసి ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలకు చెందిన 11 టీమ్లు గాలిస్తున్నాయి.
తాజావార్తలు
-
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం.. తృటిలో బతికి బయటపడ్డారు.. ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ!
-
Masoud Pezeshkian: అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
-
UPI Payment New Rules: UPI చెల్లింపు న్యూ రూల్స్.. ఈ రోజు నుండి డబ్బు పంపే విధానంలో మార్పులు
-
Virat Kohli: ప్రతి నిరాశను పాఠంగా మార్చుకున్నాడు.. నాలుగు సార్లు కింద పడ్డా పైకి లేచాడు.. కోహ్లీ గూస్ బంప్స్ రికార్డు!
-
JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!