Sanjay Raut: అమిత్ షా మళ్లీ హోంమంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడింది..
- అమిత్ షా హోమంత్రి కావడం దేశానికి ప్రమాదం..
- జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులకు బాధ్యత ఎవరిది..?
- ప్రతిపక్షాలను ఫినిష్ చేసే పనిలో షా..
- శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. బుధవారం రౌత్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్లోని టెర్రర్ దాడులపై అమిత్ షాని టార్గెట్ చేశారు. అమిత్ షా ప్రతిపక్షాలను తుడిచిపెట్టే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. షా హోంమంత్రిగా ఉన్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్లో అత్యధిక సంఖ్యలో భద్రతా బలగాలు, పౌరులు మరణించారని ఆరోపించారు. ఢిల్లీలో మోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే 10 మంది మరణించారని, హోంమంత్రి తీవ్రవాదుల్ని నిర్మూలించే పని చేస్తే దేశానికి మేలు చేస్తుందని రౌత్ చెప్పారు.
Read Also: UP Crime: “నన్ను ప్రేమించి వేరేవాడితో అక్రమ సంబంధం”.. ప్రియురాలి తలనరికి దారుణ హత్య..
Also Read
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
- Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
బీహార్, ఏపీ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులు ఇద్దరూ అమిత్ షా రాజీనామా కోరాలని అన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కాన్వాయ్పై కూడా దాడి చేశారని, మోడీ ప్రభుత్వంలో మళ్లీ అమిత్ షా హోం మంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడిందని అన్నారు. దీనికి ముందు జమ్మూ కాశ్మీర్ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రాణాలు పోతున్నాయని, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి బాధ్యులెవరని ఠాక్రే ప్రశ్నించారు. నేను దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని, ఎన్డీయే ప్రభుత్వ భవిష్యత్ గురించి కాదని అన్నారు.
ఆదివారం జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. మంగళవారం కథువా, దోడా ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. రియాసి ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలకు చెందిన 11 టీమ్లు గాలిస్తున్నాయి.
తాజావార్తలు
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
-
Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!