1 Rupee Controversy: రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెక్కిన ప్రయాణికుడు.. చివరికి ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Conductor Refuses To Return Rs 1 Change To Passenger: తమ వద్ద చిల్లర ఉన్నప్పటికీ.. కొందరు బస్ కండక్టర్లు చిల్లర లేదని చెప్తుంటారు. మరికొందరైతే.. బస్సు దిగేటప్పుడు చిల్లర తీసుకోవాలని చెప్పి, టికెట్ వెనకాల రాసిస్తారు. అయితే.. ఒకట్రెండు రూపాయలే కదా అని, చాలామంది కండక్టర్ వద్ద నుంచి చిల్లర తీసుకోకుండా వెళ్లిపోతారు. ఇంకొందరైతే.. బస్సు దిగే తొందరలో చిల్లర తీసుకోవడం మర్చిపోతారు. కానీ.. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. తనకు కండక్టర్ ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదని, ఏకంగా కోర్టుకెక్కాడు. చివరికి విజయం సాధించి.. అందరికీ ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రయాణికుడి హక్కు గురించి అవగాహన కల్పించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Russia: రష్యా అధ్యక్షుడి షాకింగ్ ప్రకటన.. అమెరికాతో అణు ఒప్పందానికి బ్రేక్
Also Read
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
2019లో రమేశ్ నాయక్ అనే వ్యక్తి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కాడు. శాంతి నగర్ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర రూ. 29 కావడంతో.. అతడు కండక్టర్కు రూ.30 ఇచ్చాడు. అయితే.. కండక్టర్ అతనికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. చిల్లర ఇవ్వకుండానే వెళ్తుండటంతో.. తన రూపాయి తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఇందుకు ఆ కండక్టర్ ‘నా వద్ద చిల్లర లేదు’ అంటూ గట్టిగా అరిచాడు. కండక్టర్ తీరు చూసి ఖంగుతిన్న రమేశ్.. అతనిపై బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. వాళ్లు ఈ ఫిర్యాదుని సీరియస్గా తీసుకోలేదు. తాను ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో.. రమేశ్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. తన రూపాయి తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారని, ఇందుకు రూ.15వేలు పరిహారంగా ఇప్పించాలని కోరాడు.
KL Rahul: కేఎల్ రాహుల్కి మరో బిగ్ షాక్.. స్థానం పోయినట్టే?
ఈ కేసుని పరిశీలించిన న్యాయస్థానం.. బీఎంటీసీకి షాక్ ఇస్తూ, రమేశ్కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రమేశ్కు రూ.2,000 పరిహారంగా చెల్లించడంతో పాటు న్యాయప్రక్రియకు అయిన ఖర్చుకి గాను మరో రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ 45 రోజుల్లోగా పరిహారం ఇవ్వకపోతే.. ఏటా రూ.6,000 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో బీఎంటీసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇది ఒక్క రూపాయి చిల్లర విషయం గురించి మాత్రమే కాదని, వినియోగదారుడి హక్కు అంశమని స్పష్టం చేసింది. కండక్టర్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టిన కోర్టు.. నష్టపరిహారం రమేశ్కి చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!