కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు బడ్జెట్-2022ను ఆవిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రకారం కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా.. కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. అందువల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ధరలు తగ్గే వస్తువుల జాబితా: మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ట్రాన్స్ఫార్మర్లు, వజ్రాలు, రత్నాలు, పలు రకాల ఇమిటేషన్ జ్యూవెలరీ, పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగించే కెమికల్స్, మిథనాల్, కెమెరా లైసెన్సులు, స్టీల్ స్క్రాప్, వ్యవసాయ పరికరాలు, దుస్తులు, పాదరక్షలు, విదేశీ యంత్రాలకు సంబంధించిన సామాగ్రి, తోలు వస్తువులు
ధరలు పెరిగే వస్తువుల జాబితా: ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, విదేశీ గొడుగులు, క్రిప్టో లావాదేవీలు, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ఫోన్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్
కాగా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఐటీఆర్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి మరింత గడువు ఇచ్చింది. రెండేళ్ల గడువు ఇస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాధారణంగా పన్ను చెల్లింపుదారులకు డిసెంబర్ 31 వరకు గడువు ఇస్తారు. అయితే బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం చూస్తే సంబంధిత అసెస్మెంట్ ముగిసిన తర్వాత రెండేళ్ల వరకు గడువు లభించనుంది.