Drone squadrons: భారత్ శత్రు దుర్భేద్యం.. పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ‘‘డ్రోన్ స్వ్కాడ్రన్’’..
- భారత సరిహద్దులు శత్రు దుర్భేద్యం..
- పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ‘‘డ్రోన్ స్వ్కాడ్రన్’’..
- ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక నిర్ణయం..
Drone squadrons: భారత్-పాకిస్తాన్ సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యంగా మారనుంది. శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను నిర్వీ్ర్యం చేసేందుకు సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ‘‘డ్రోన్ స్వ్కాడ్రన్’’ను మోహరిస్తోంది. మే 7 నుంచి మే 10 మధ్య పాకిస్తాన్తో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’నిర్వహించింది. దీని తర్వాత పాకిస్తాన్ డ్రోన్లతో భారత్పై దాడులు చేయడానికి ప్రయత్నించింది. అయితే, మన సైన్యం విజయవంతంగా ఈ దాడుల్ని తిప్పికొట్టాయి. మనదేశంలో సైనిక, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని 1000కి పైగా డ్రోన్లను పంపింది.
Read Also: Delhi: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం..
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ఈ నేపథ్యంలో డ్రోన్ వార్ఫేర్లో భారత్ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు పాకిస్తాన్తో పంచుకుంటున్న 3323 కి.మీ సరిహద్దులో డ్రోన్ స్వ్కాడ్రన్లను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఇవి సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ అవుట్ పోస్టుల నుంచి పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదించబడిన స్వ్కాడ్రన్లు నిఘా, హై టార్గెట్ శత్రువుల లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల కోసం కామికేజ్ డ్రోన్లను మోహరించే అవకాశం ఉంది.
ఈ మేరకు బీఎస్ఎఫ్ సిబ్బందికి ఇప్పటికే డ్రోన్ ఆపరేషన్లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో నిఘా, సరిహద్దు దాటి ఖచ్చితమైన దాడులు చేయడం, డ్రోన్ సమూహ దాడులను ప్రారంభించడం, శత్రువుల డోన్లను ఎంగేజ్ చేయడం, శత్రువుల రాడార్లను నాశనం చేయడం, సిగ్నల్ జామింగ్ వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ బోర్డర్ అవుట్ పోస్ట్(BOP)లలో డ్రోన్ ఆపరేషన్లలో శిక్షణ పొందిన ఇద్దరు-ముగ్గురు సిబ్బంది ఉంటారని భావిస్తున్నారు. బీఎస్ఎఫ్ చండీగఢ్ బెటాలియన్లో ఏర్పాటు చేయనున్న కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ ఉండనున్నట్లు సమాచారం. భారత ప్రభుత్వ అధికారులు అనేక దేశాలు, భారతీయ కంపెనీలో సంప్రదింపులు జరుపుతున్నారని, అందుబాటులో ఉన్న ఆప్షన్లను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!