Rajya Sabha: రాజ్యసభలో బీజేపీకి తగ్గిన సభ్యులు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!
- రాజ్యసభలో బీజేపీకి తగ్గిన సభ్యులు
- మెజారిటీ మార్కు 113కి కంటే తక్కువ
- బీజేపీకి సొంతంగా 86 సీట్లే
- బిల్లులు ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతుతోనే సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది. రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది. అంటే మెజారిటీ మార్కు 113 కంటే తక్కువగా ఉంది. అయితే ఎన్డీఏకు ఏడుగురు నామినేటెడ్, ఒక స్వతంత్రుడి మద్దతు ఉంది. ఇక శనివారం నలుగురు నామినేటెడ్ సభ్యులు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం పూర్తి అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా ఎంపిక ఎన్నికైన వీరి పదవీకాలం ముగిసింది. దీంతో ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో 86 మంది సభ్యులే ఉన్నారు. ప్రస్తుతం బిల్లులు ఆమోదం పొందాలంటే కచ్చితంగా వైసీపీ, అన్నాడీఎంకేపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. బిల్లులు ఆమోదించాలంటే మోడీ సర్కార్.. వైసీపీ మద్దతు తీసుకోవల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Balineni Srinivas Reddy: జనసేనలో చేరికపై బాలినేని క్లారిటీ..!
Also Read
ప్రస్తుతం బీజేపీకి 86 సీట్లు ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్కు 26, తృణమూల్ కాంగ్రెస్కు 13, వైసీపీకి 11, ఆప్, డీఎంకేకు చెరో 10 సీట్లు ఉన్నాయి. లోక్సభలో ఎంపీలు లేకపోయినా.. రాజ్యసభలో మాత్రం బీఎస్పీకి ఒక సభ్యుడు ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో తమ్ముడు అరెస్ట్.. ఆ ఫోటోలు షేర్ చేసిన రకుల్
ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మొత్తం 87 ఉన్నాయి. అందులో కాంగ్రెస్కు 26, బెంగాల్లోని అధికార తృణమూల్కు 13, ఢిల్లీ మరియు తమిళనాడులో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మరియు డిఎంకేకు ఒక్కొక్కటి 10 ఉన్నాయి. ఇక తెలంగాణలోని బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు.
ప్రస్తుతానికి మొత్తం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అస్సాం, బీహార్లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు త్రిపుర నుంచి ఏడు గెలిచే సంఖ్య ఉంది. ఇక మహారాష్ట్రలో సంఖ్యాబలం ఉంటే మరో రెండు గెలుచుకోవచ్చు. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ సభ్యుల ఓట్లతో పాటు వైఎస్సార్సీపీ ఓట్లతో గెలిస్తే మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత ఎక్కువగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో నాలుగు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 30 లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: KP Sharma Oli: నాలుగోసారి నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం.. మోడీ అభినందనలు
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!