Rajya Sabha: రాజ్యసభలో బీజేపీకి తగ్గిన సభ్యులు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!
- రాజ్యసభలో బీజేపీకి తగ్గిన సభ్యులు
- మెజారిటీ మార్కు 113కి కంటే తక్కువ
- బీజేపీకి సొంతంగా 86 సీట్లే
- బిల్లులు ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతుతోనే సాధ్యం
రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది. రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది. అంటే మెజారిటీ మార్కు 113 కంటే తక్కువగా ఉంది. అయితే ఎన్డీఏకు ఏడుగురు నామినేటెడ్, ఒక స్వతంత్రుడి మద్దతు ఉంది. ఇక శనివారం నలుగురు నామినేటెడ్ సభ్యులు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం పూర్తి అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా ఎంపిక ఎన్నికైన వీరి పదవీకాలం ముగిసింది. దీంతో ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో 86 మంది సభ్యులే ఉన్నారు. ప్రస్తుతం బిల్లులు ఆమోదం పొందాలంటే కచ్చితంగా వైసీపీ, అన్నాడీఎంకేపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. బిల్లులు ఆమోదించాలంటే మోడీ సర్కార్.. వైసీపీ మద్దతు తీసుకోవల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Balineni Srinivas Reddy: జనసేనలో చేరికపై బాలినేని క్లారిటీ..!
ప్రస్తుతం బీజేపీకి 86 సీట్లు ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్కు 26, తృణమూల్ కాంగ్రెస్కు 13, వైసీపీకి 11, ఆప్, డీఎంకేకు చెరో 10 సీట్లు ఉన్నాయి. లోక్సభలో ఎంపీలు లేకపోయినా.. రాజ్యసభలో మాత్రం బీఎస్పీకి ఒక సభ్యుడు ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో తమ్ముడు అరెస్ట్.. ఆ ఫోటోలు షేర్ చేసిన రకుల్
ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మొత్తం 87 ఉన్నాయి. అందులో కాంగ్రెస్కు 26, బెంగాల్లోని అధికార తృణమూల్కు 13, ఢిల్లీ మరియు తమిళనాడులో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మరియు డిఎంకేకు ఒక్కొక్కటి 10 ఉన్నాయి. ఇక తెలంగాణలోని బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు.
ప్రస్తుతానికి మొత్తం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అస్సాం, బీహార్లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు త్రిపుర నుంచి ఏడు గెలిచే సంఖ్య ఉంది. ఇక మహారాష్ట్రలో సంఖ్యాబలం ఉంటే మరో రెండు గెలుచుకోవచ్చు. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ సభ్యుల ఓట్లతో పాటు వైఎస్సార్సీపీ ఓట్లతో గెలిస్తే మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత ఎక్కువగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో నాలుగు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 30 లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: KP Sharma Oli: నాలుగోసారి నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం.. మోడీ అభినందనలు
తాజావార్తలు
-
Virat Kohli: విరాట్ కోహ్లీని చూస్తే చాలా బాధగా ఉంది.. జర్మన్ బ్యూటీ రియాక్షన్..
-
Sattu Laddu Recipe Without Sugar: పంచదార, పాకం లేకుండా హై ప్రోటీన్ సత్తు లడ్డూ.. ఇలా సింపుల్గా తయారు చేయండి!
-
Nagababu-Prakash Raj: రాముడిపై విషం చిమ్మితే గతి అంతే! ప్రకాష్ రాజ్కు నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్!
-
CM Chandrababu Nidadavolu visit: నిడదవోలులో సీఎం చంద్రబాబు పర్యటన..
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
ట్రెండింగ్
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!