K. Laxman: ధన్యవాద్ మోడీ పేరుతో సమ్మేళన సదస్సులు.. ఓబీసీ మోర్చా నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Laxman: ధన్యవాద్ మోడీ పేరుతో ఓబీసీ సమ్మేళన సదస్సులు నిర్వహించాలని ఓబీసీ మోర్చా నిర్ణయించిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మహా సంపర్క్ అభియాన్ పేరుతో ప్రధాని స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు నివేదిక రూపంలో ప్రజల ముందుకు రానున్నామని తెలిపారు. మే 30 నుంచి జూన్ 30 వరకు తెలంగాణలోని ప్రతి ఊరికి బీజేపీ వెళ్తుందని వెల్లడించారు. ప్రపంచ దేశాలు మోడీ నాయకత్వాన్ని ఆరాధిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాలవారీగా అభివృద్ధి నివేదికలు రూపొందించి ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 303 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామన్నారు. జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిల్లో కార్యవర్గ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ధన్యవాద్ మోడీ పేరుతో ఓబీసీ సమ్మేళన సదస్సులు నిర్వహించాలని ఓబీసీ మోర్చా నిర్ణయించిందని అన్నారు. తెలంగాణా అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని అన్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ పంటనష్టపోతే స్పందించలేదన్నారు. పంట నష్టం జరిగి రైతులు, కౌలు రైతులు ఇబ్బందుల్లో ఉంటె కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. 10 వేలు ఇస్తామని చెప్పిన టి సర్కార్ ఒక్కరూపాయి విడుదల చేయలేదన్నారు.
Read also: Revanth Reddy: నన్ను ఎలా వాడుకోవాలో అని అధిష్టానం ఆలోచిస్తుంది..!
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
కేంద్రప్రభుత్వ పథకం ఫసల్ భీమా ను తెలంగాణలో అమలు చేయకుండా రైతుల నోట్లో మన్నుకొట్టారని ఆరోపించారు. కేసీఆర్ ది ది 30 శాతం కమిషన్ సర్కార్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో బీఆర్ఎస్ కు బీజేపీ నే ప్రత్యామ్యాయమన్నారు. బీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కర్ణాటక ప్రమాణస్వీకారానికి పిలవలేదన్నారు. కాంగ్రెస్ ని గెలిపించేందుకు జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ కు మళ్లేలా కేసీఆర్ వ్యవహరించారన్నారు. బీఆర్ఎస్ తో కలిసే పరిస్థితి వస్తుందంటూ స్వయంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని అన్నారు. కవితను అరెస్ట్ చేసేది దర్యాప్తు సంస్థలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జోక్యం ఉండదని అన్నారు. మేము చేరికలపై ఆధారపడలేదన్నారు. జాయినింగ్స్ నిరంతర ప్రక్రియ అన్నారు. మోడీ మీద ఉన్న ఆక్రోశంతోనే విపక్షాలు పార్లమెంట్ భవన ప్రారంభ వేడుకలను బాయికాట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రధాని హోదాలోనే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ ప్రారంబోత్సవాలు చేసిన సందర్భాలున్నాయన్నారు.
Etela Rajender: కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్లారు.. ఈటెల సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!