Rahul Gandhi: బీజేపీ ద్వేషాన్ని పెంచుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP spreading hatred, Rahul Gandhi criticizes BJP: భారత్ జోడో యాత్రలో మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బుధవారం ఉదయం ఆయన గురుద్వారా ఫతేగఢ్ సాహిబ్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. అక్కడే జరిగిన ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతోందని విమర్శించారు. అయితే భారతదేశం సోదరభావం, ఐక్యత, గౌరవంతో కూడిందని అందుకే యాత్ర విజయవంతం అయిందని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు వెల్లడించారు. రైతులు, దుకాణదారులు, కార్మికులు, నిరుద్యోగ యువతతో మాట్లాడానని అన్నారు.
Read Also: Zelensky: మూడో ప్రపంచ యుద్ధం ఉండదు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో జెలన్ స్కీ ప్రసంగం..
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
యాత్రలో భాగంగా భారతదేశంలో అతిపెద్ద సమస్యలు అయిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం గురించి పోరాడామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ యాత్ర ప్రసంగాలు చేయడానికి కాదని.. ప్రజలు చెప్పేది వినేందుకు అని తెలిపారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్ రాష్ట్రంలో సాగుతోంది. ఆ తరువాత యాత్రలో భాగంగా చివరిగా జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించనుంది. అంతకుముందు జనవరి 19న పఠాన్ కోట్ లో భారీ ర్యాలీ జరగనుంది.
గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభం అయింది. జనవరి 30న శ్రీనగర్ లో యాత్ర ముగియనుంది. మిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. మొత్తం 5 నెలల్లో 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగునుంది.
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!