Vice President: పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి! వారికి ఛాన్స్ లేనట్లే!
- పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి!
- వారికి ఛాన్స్ లేనట్లే! తేల్చేసిన బీజేపీ వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖర్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఊహించని రీతిలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంత సడన్గా రాజీనామా ఎందుకు చేశారంటూ రకరకాలైన ఊహాగానాలు వచ్చాయి. అనారోగ్యం కారణంగా రాజీనామా చేసినట్లు ఆయన చెబుతున్నా.. అంతర్గతంగా ఏదో జరిగిందంటూ విపక్షాలు కోడైకూస్తున్నాయి. మొత్తానికి రెండేళ్ల పదవి ఉండగానే ధన్ఖర్ తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన వారసుడి కోసం హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Off The Record : ప్రత్యక్ష రాజకీయాల వైపు మల్లారెడ్డి కోడలు అడుగులు?
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ఈసారి మిత్రపక్షాలకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చని పొలిటికల్ సర్కిల్లో అనేకమైన పుకార్లు వినిపిస్తు్న్నాయి. ముఖ్యంగా బీహార్లో ఈసారి బలం పుంజుకునేందుకు నితీష్ కుమార్కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వార్తలు వినిపించాయి. ఇక రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్గా ఉన్న హరివంశ్కు ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. ఇక కాంగ్రెస్కు దూరంగా ఉంటూ.. బీజేపీకి దగ్గరగా ఉన్న శశిథరూర్కు ఆ పదవి కట్టబెట్టొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా రకరకాలైన పేర్లు వ్యాప్తి చెందుతున్నాయి.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్లో ఎంబసీపై దాడులు.. నకిలీ రాయబారి అరెస్ట్
తాజాగా ఈ ఊహాగానాలకు బీజేపీ చెక్ పెట్టింది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవిని పార్టీ విధేయులకే ఇస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ భావజాలంతో దగ్గర సంబంధం కలిగి ఉన్న వ్యక్తే తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారని చెబుతున్నాయి.
ఇటీవల జేడీయూ నాయకుడు, కేంద్రమంత్రి రామ్రాథ్ ఠాకూర్.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవిని ఠాకూర్కు ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను బీజేపీ వర్గాలు తీవ్రంగా తోసిపుచ్చాయి. సాధారణ సమావేశమే తప్ప.. అందులో విశేషం ఏమీలేదని తేల్చేశాయి. ఆ పదవి గురించే చర్చ జరగలేదన్నారు.
ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కోసం ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపింది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు కానుంది. త్వరలో దీనిపై షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్లో తెలిపింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!