Vice President: పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి! వారికి ఛాన్స్ లేనట్లే!
- పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి!
- వారికి ఛాన్స్ లేనట్లే! తేల్చేసిన బీజేపీ వర్గాలు
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖర్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఊహించని రీతిలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంత సడన్గా రాజీనామా ఎందుకు చేశారంటూ రకరకాలైన ఊహాగానాలు వచ్చాయి. అనారోగ్యం కారణంగా రాజీనామా చేసినట్లు ఆయన చెబుతున్నా.. అంతర్గతంగా ఏదో జరిగిందంటూ విపక్షాలు కోడైకూస్తున్నాయి. మొత్తానికి రెండేళ్ల పదవి ఉండగానే ధన్ఖర్ తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన వారసుడి కోసం హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Off The Record : ప్రత్యక్ష రాజకీయాల వైపు మల్లారెడ్డి కోడలు అడుగులు?
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ఈసారి మిత్రపక్షాలకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చని పొలిటికల్ సర్కిల్లో అనేకమైన పుకార్లు వినిపిస్తు్న్నాయి. ముఖ్యంగా బీహార్లో ఈసారి బలం పుంజుకునేందుకు నితీష్ కుమార్కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వార్తలు వినిపించాయి. ఇక రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్గా ఉన్న హరివంశ్కు ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. ఇక కాంగ్రెస్కు దూరంగా ఉంటూ.. బీజేపీకి దగ్గరగా ఉన్న శశిథరూర్కు ఆ పదవి కట్టబెట్టొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా రకరకాలైన పేర్లు వ్యాప్తి చెందుతున్నాయి.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్లో ఎంబసీపై దాడులు.. నకిలీ రాయబారి అరెస్ట్
తాజాగా ఈ ఊహాగానాలకు బీజేపీ చెక్ పెట్టింది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవిని పార్టీ విధేయులకే ఇస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ భావజాలంతో దగ్గర సంబంధం కలిగి ఉన్న వ్యక్తే తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారని చెబుతున్నాయి.
ఇటీవల జేడీయూ నాయకుడు, కేంద్రమంత్రి రామ్రాథ్ ఠాకూర్.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవిని ఠాకూర్కు ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను బీజేపీ వర్గాలు తీవ్రంగా తోసిపుచ్చాయి. సాధారణ సమావేశమే తప్ప.. అందులో విశేషం ఏమీలేదని తేల్చేశాయి. ఆ పదవి గురించే చర్చ జరగలేదన్నారు.
ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కోసం ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపింది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు కానుంది. త్వరలో దీనిపై షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్లో తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?