Vice President: పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి! వారికి ఛాన్స్ లేనట్లే!
- పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి!
- వారికి ఛాన్స్ లేనట్లే! తేల్చేసిన బీజేపీ వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖర్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఊహించని రీతిలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంత సడన్గా రాజీనామా ఎందుకు చేశారంటూ రకరకాలైన ఊహాగానాలు వచ్చాయి. అనారోగ్యం కారణంగా రాజీనామా చేసినట్లు ఆయన చెబుతున్నా.. అంతర్గతంగా ఏదో జరిగిందంటూ విపక్షాలు కోడైకూస్తున్నాయి. మొత్తానికి రెండేళ్ల పదవి ఉండగానే ధన్ఖర్ తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన వారసుడి కోసం హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Off The Record : ప్రత్యక్ష రాజకీయాల వైపు మల్లారెడ్డి కోడలు అడుగులు?
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
ఈసారి మిత్రపక్షాలకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చని పొలిటికల్ సర్కిల్లో అనేకమైన పుకార్లు వినిపిస్తు్న్నాయి. ముఖ్యంగా బీహార్లో ఈసారి బలం పుంజుకునేందుకు నితీష్ కుమార్కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వార్తలు వినిపించాయి. ఇక రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్గా ఉన్న హరివంశ్కు ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. ఇక కాంగ్రెస్కు దూరంగా ఉంటూ.. బీజేపీకి దగ్గరగా ఉన్న శశిథరూర్కు ఆ పదవి కట్టబెట్టొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా రకరకాలైన పేర్లు వ్యాప్తి చెందుతున్నాయి.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్లో ఎంబసీపై దాడులు.. నకిలీ రాయబారి అరెస్ట్
తాజాగా ఈ ఊహాగానాలకు బీజేపీ చెక్ పెట్టింది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవిని పార్టీ విధేయులకే ఇస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ భావజాలంతో దగ్గర సంబంధం కలిగి ఉన్న వ్యక్తే తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారని చెబుతున్నాయి.
ఇటీవల జేడీయూ నాయకుడు, కేంద్రమంత్రి రామ్రాథ్ ఠాకూర్.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవిని ఠాకూర్కు ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను బీజేపీ వర్గాలు తీవ్రంగా తోసిపుచ్చాయి. సాధారణ సమావేశమే తప్ప.. అందులో విశేషం ఏమీలేదని తేల్చేశాయి. ఆ పదవి గురించే చర్చ జరగలేదన్నారు.
ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కోసం ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపింది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు కానుంది. త్వరలో దీనిపై షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్లో తెలిపింది.
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!