Atul Subhash case: ‘‘మగాళ్లు బలవుతున్నారు’’.. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ..
- అతుల్ సుభాష్ కేసుని పార్లమెంట్లో లేవనెత్తిన బీజేపీ ఎంపీ..
- తప్పుడు ఆరోపణలు చేసే మహిళలపై చర్యలకు డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Sharma: గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి భార్య తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిన కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో ఇలా చట్టాలను దుర్వినియోగం చేసే మహిళలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
అయితే, ‘‘సుభాష్ ఆత్మహత్య’’ అంశాన్ని బీజేపీ రాజ్యసభ ఎంపీ దినేశ్ శర్మ పార్లమెంట్లో లేవనెత్తాడు. తప్పుడు ఆరోపణలపై, చట్టాల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా తప్పుడు నేరాలు ఎదుర్కొంటున్న మగవాళ్లకు చట్టపరమైన, భావోద్వేగ మద్దతు ఇవ్వాలని దినేశ్ శర్మ డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
Read Also: Uttar Pradesh : కొత్త పెళ్లైన జంట మధ్య బొట్టు బిళ్ల పెట్టిన చిచ్చు.. చివరికి ఏమైందంటే ?
సోమవారం రాజ్యసభలో ఎంపీ దినేష్ శర్మ జీరో అవర్ సమయంలో అతుల్ సుభాష్ ఆత్మహత్యను ప్రస్తావించారు. ఈ సమయంలో, గృహ హింస మరియు వేధింపులకు సంబంధించిన చట్టాలను లింగ తటస్థంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గృహహింస, దోపిడీ నుంచి మహిళలకు రక్షణ కల్పించడంలో చట్టం ఎంతో పురోగతి సాధించిందని, అయితే ఇలాంటి హింస, దోపిడీ నుంచి పురుషులకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఎంపీ అన్నారు.
ఆత్మహత్యలకు సంబంధించిన ఎన్సీఆర్బీ గణాంకాలను కూడా దినేశ్ శర్మ సభలో వెల్లడించారు. 2022లో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 72 శాతం మంది అంటే మొత్తం 1,25,000 మంది పురుషులు కాగా, మహిళల సంఖ్య దాదాపు 47,000 అని ఆయన చెప్పారు. 2014 మరియు 2021 మధ్య పురుషులు మరియు మహిళల మధ్య ఆత్మహత్యల నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఈ కాలంలో 107.5 శాతం మంది పురుషులు ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!