Atul Subhash case: ‘‘మగాళ్లు బలవుతున్నారు’’.. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ..
- అతుల్ సుభాష్ కేసుని పార్లమెంట్లో లేవనెత్తిన బీజేపీ ఎంపీ..
- తప్పుడు ఆరోపణలు చేసే మహిళలపై చర్యలకు డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Sharma: గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి భార్య తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిన కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో ఇలా చట్టాలను దుర్వినియోగం చేసే మహిళలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
అయితే, ‘‘సుభాష్ ఆత్మహత్య’’ అంశాన్ని బీజేపీ రాజ్యసభ ఎంపీ దినేశ్ శర్మ పార్లమెంట్లో లేవనెత్తాడు. తప్పుడు ఆరోపణలపై, చట్టాల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా తప్పుడు నేరాలు ఎదుర్కొంటున్న మగవాళ్లకు చట్టపరమైన, భావోద్వేగ మద్దతు ఇవ్వాలని దినేశ్ శర్మ డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
Read Also: Uttar Pradesh : కొత్త పెళ్లైన జంట మధ్య బొట్టు బిళ్ల పెట్టిన చిచ్చు.. చివరికి ఏమైందంటే ?
సోమవారం రాజ్యసభలో ఎంపీ దినేష్ శర్మ జీరో అవర్ సమయంలో అతుల్ సుభాష్ ఆత్మహత్యను ప్రస్తావించారు. ఈ సమయంలో, గృహ హింస మరియు వేధింపులకు సంబంధించిన చట్టాలను లింగ తటస్థంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గృహహింస, దోపిడీ నుంచి మహిళలకు రక్షణ కల్పించడంలో చట్టం ఎంతో పురోగతి సాధించిందని, అయితే ఇలాంటి హింస, దోపిడీ నుంచి పురుషులకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఎంపీ అన్నారు.
ఆత్మహత్యలకు సంబంధించిన ఎన్సీఆర్బీ గణాంకాలను కూడా దినేశ్ శర్మ సభలో వెల్లడించారు. 2022లో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 72 శాతం మంది అంటే మొత్తం 1,25,000 మంది పురుషులు కాగా, మహిళల సంఖ్య దాదాపు 47,000 అని ఆయన చెప్పారు. 2014 మరియు 2021 మధ్య పురుషులు మరియు మహిళల మధ్య ఆత్మహత్యల నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఈ కాలంలో 107.5 శాతం మంది పురుషులు ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!