Rahul Gandhi: బీజేపీ హిందూ-ముస్లిం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది.. ఇది అంబానీ-అదానీ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP is spreading hatred between Hindus and Muslims, Says Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ‘భారత్ జోడో యాత్ర’ను చేపట్టింది. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి యాత్రను మొదలుపెట్టారు. తాజాగా ఈ యాత్ర పలు రాష్ట్రాల గుండా ఢిల్లీకి చేరుకుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ‘యునైట్ ఇండియా మార్చ్’ జరిగింది. శనివారం సాయంత్ర ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు రాహుల్ గాంధీ. అధికార భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు.
మతపరమైన విభేదాలను ఆయుధంగా చేసుకుని బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు హిందూ-ముస్లిం ద్వేషాన్ని 24 గంటలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీలు ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరిలో పాటు స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)పార్టీ అధినేత కమల్ హాసన్, రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. నేను 2,800 కిలోమీటర్లు నడిచాను కానీ ఎలాంటి ద్వేషాన్ని చూడలేదు. నేను టీవీని ఆన్ చేసినప్పుడు మాత్రం నాకు హింస కనిపిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇది నరేంద్రమోదీ ప్రభుత్వం కాదని.. అంబానీ-అదానీల ప్రభుత్వం అని విమర్శించారు. డిగ్రీ పట్టా పొందిన యువకులు పకోడీలు అమ్ముకుంటున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
Also Read
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
- CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
Read Also: Maternity Leave To Students: విద్యార్థినులకు మాతృత్వ సెలవులు.. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్ణయం
కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ యాత్రలో పాల్గొనడం రాజకీయంగా నష్టపరుస్తుందని పలువురు తనకు చెప్పారని.. అయితే నా మనస్సు మాత్రం దేశానికి ఇది చాలా అవసరం అని చెప్పిందన్నారు. దేశాన్ని ఏకం చేయడంలో సహాయపడండి.. విచ్చిన్నం చేయవద్దని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.
కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుకుంది. యాత్రలో భాగంగా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర సాగింది. కాశ్మీర్ లో జోడో యాత్ర ముగియనుంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!