Bihar: బీహార్పై ఫోకస్ పెట్టిన బీజేపీ! ఎన్ని సీట్లు లక్ష్యమంటే..!?
- బీహార్పై ఫోకస్ పెట్టిన బీజేపీ!
- ఎన్ని సీట్లు లక్ష్యమంటే..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నూతనోత్సాహం బీహార్లోనూ కొనసాగేలా కేడర్ను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ ఆ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఢిల్లీలో పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ చాకచక్యంగా తమ వైపు మలుచుకోగలిగింది. సులువుగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అదే మాదిరిగా నితీష్ కుమార్ సర్కార్పై ఏర్పడిన వ్యతిరేకతను తెలివిగా తిప్పికొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం కాషాయ పార్టీ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal : మమతా బెనర్జీకి రూ.11 కోట్లకు నోటీసు పంపిన బెంగాల్ గవర్నర్
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎలాగైనా 225 సీట్లు సాధించి తీరాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. నితీష్ కుమార్తో కలిసి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పటికే ఆర్జేడీ.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఆ అవకాశం తేజస్వీ యాదవ్కు ఇవ్వకూడదని బీజేపీ ఆలోచన చేస్తోంది. ఎలాగైనా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. సీట్ల పంపకాల విషయంలో తేడా రాకుండా నితీష్ కుమార్తో చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే జేడీయూ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలని చూస్తోంది. దీనికి బీజేపీ ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: YS Jagan: ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ఇక 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో పోటీ చేస్తే కేవలం 43 సీట్లు మాత్రమే సాధించింది. ఇక బీజేపీ పోటీ చేసిన 110 సీట్లలో 74 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ అనూహ్యంగా తక్కువ సీట్లు సాధించినా నితీష్ కుమారే ముఖ్యమంత్రి కావడం విశేషం. మధ్యలో ఆర్జేడీతో నితీష్ కుమార్ కలిసి వెళ్లినా.. కొద్ది రోజులకే తిరిగి బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ-జేడీయా కూటమి ఎక్కువ పార్లమెంట్ సీట్లు సాధించింది.
ఇది కూడా చదవండి: Gold Rates : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!