Bihar: బీహార్పై ఫోకస్ పెట్టిన బీజేపీ! ఎన్ని సీట్లు లక్ష్యమంటే..!?
- బీహార్పై ఫోకస్ పెట్టిన బీజేపీ!
- ఎన్ని సీట్లు లక్ష్యమంటే..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నూతనోత్సాహం బీహార్లోనూ కొనసాగేలా కేడర్ను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ ఆ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఢిల్లీలో పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ చాకచక్యంగా తమ వైపు మలుచుకోగలిగింది. సులువుగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అదే మాదిరిగా నితీష్ కుమార్ సర్కార్పై ఏర్పడిన వ్యతిరేకతను తెలివిగా తిప్పికొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం కాషాయ పార్టీ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal : మమతా బెనర్జీకి రూ.11 కోట్లకు నోటీసు పంపిన బెంగాల్ గవర్నర్
Also Read
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎలాగైనా 225 సీట్లు సాధించి తీరాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. నితీష్ కుమార్తో కలిసి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పటికే ఆర్జేడీ.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఆ అవకాశం తేజస్వీ యాదవ్కు ఇవ్వకూడదని బీజేపీ ఆలోచన చేస్తోంది. ఎలాగైనా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. సీట్ల పంపకాల విషయంలో తేడా రాకుండా నితీష్ కుమార్తో చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే జేడీయూ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలని చూస్తోంది. దీనికి బీజేపీ ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: YS Jagan: ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ఇక 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో పోటీ చేస్తే కేవలం 43 సీట్లు మాత్రమే సాధించింది. ఇక బీజేపీ పోటీ చేసిన 110 సీట్లలో 74 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ అనూహ్యంగా తక్కువ సీట్లు సాధించినా నితీష్ కుమారే ముఖ్యమంత్రి కావడం విశేషం. మధ్యలో ఆర్జేడీతో నితీష్ కుమార్ కలిసి వెళ్లినా.. కొద్ది రోజులకే తిరిగి బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ-జేడీయా కూటమి ఎక్కువ పార్లమెంట్ సీట్లు సాధించింది.
ఇది కూడా చదవండి: Gold Rates : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!