Bengal Election: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మూడో అభ్యర్థుల జాబితానను విడుదల చేసింది. ఈ జాబితాలో 19 మందికి బీజేపీ ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చారు. ఇందులో పలువురు కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. అయితే, ఈ జాబితాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అత్యాచారం, హత్య బాధితురాలు తల్లికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో కీలకమైన పానిహటి నియోజకవర్గం నుంచి పీజీ వైద్యురాలి తల్లి రత్న దేబ్నాథ్ను బరిలోకి దింపింది.
Read Also: Jaishankar: పాకిస్తాన్ ‘‘బ్రోకర్ దేశం’’, మనం కాదు.. విపక్షాలకు ఇచ్చిపడేసిన జైశంకర్..
రత్న దేబ్నాథ్ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, మమతా బెనర్జీ శాంతిభద్రతను పట్టించుకోవడం లేదనే సందేశాన్ని పంపిస్తుంది. మహిళల సేఫ్టీని బీజేపీ హైలెట్ చేస్తుంది. 2024లో కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో పీజీ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య జరిగింది. పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తర్వాత బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి బీజేపీ ఈ సెంటిమెంట్ను రగిలించింది.