Delhi Elections 2025: ఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాల వివాదం.. ఆప్- బీజేపీ మధ్య మాటల యుద్ధం..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే..
- చైనీస్ సీసీ కెమెరాలపై ఆప్- బీజేపీ మధ్య మాటల యుద్ధం..
- ఓటమి భయంతోనే కేజ్రీవాల్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు: ప్రవేశ్ వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న కమలం పార్టీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేజ్రీవాల్ పంజాబ్ సర్కార్ వనరులను వినియోగించుకుని.. మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే పంజాబ్లోని ప్రభుత్వ స్కూల్స్ టీచర్లను ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీకి పిలిపించారని.. వారు ఆప్ కార్యకర్తలుగా మారిపోయి.. ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రవేశ్ వర్మ ఆరోపణలు చేశారు.
Read Also: Rashmika: నడవలేని స్థితిలో రష్మిక.. ఎయిర్ పోర్టులో వీడియో వైరల్
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
అయితే, ఇటీవల అమృత్సర్ నుంచి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ తెలిపాడు. ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు భద్రతాకు ముప్ప వాటిల్లుతుందని అన్నాడు. పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వాహనాలు వస్తున్నాయి.. వాటిలోని వస్తువులను పోలీసులు తనిఖీ చేయడం లేదు.. అలాగే, పంజాబ్ ప్రభుత్వ ట్రక్కులలో కుర్చీలతో పాటు ఇతర వస్తువులు ఢిల్లీకి చేరుకుంటున్నాయన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో పంజాబ్ ప్రభుత్వ సాయాన్ని వెంటనే నియంత్రించాలని ఈసీని కోరతాను.. ఇక్కడి ప్రజలకు నిజా నిజాలన్నీ తెలుసు.. రాబోయే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం ఖాయమని ప్రవేశ్వర్మ జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!