Bird Flu: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ అలర్ట్.. కడక్నాథ్ కోళ్లలో గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Flu Alert In Jharkhand: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. బొకారో జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రతమత్తం అయింది. లోహాంచల్ లోని ప్రసిద్ధ ‘‘కడక్ నాథ్’’ కోళ్ల మాంసంలో హెచ్5ఎన్1 వేరియంట్ ఉన్నట్లు నిర్థారించారు. అధిక ప్రొటీన్లు ఉండే కడక్ నాథ్ కొళ్లలో ఈ వేరియంట్ ను కనుక్కున్నారు. లోహంచల్లోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా కడక్నాథ్ కోళ్లు చనిపోయాయి. ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాలను ప్రభావిత జోన్ గా ప్రకటించారు. 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో నిఘాను పెంచారు.
Read Also: Wednesday Stotram: విద్య, వివాహం, అభివృద్దికి ఈ స్తోత్ర పారాయణం చేయండి
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ప్రభావిత ప్రాంతాల్లో కొళ్లు, బాతుల అమ్మకాలతో పాటు మాంసం అమ్మకాలను నిషేధించారు. బర్డ్ ఫ్లూ విషయంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి అరుణ్ కుమార్ వెల్లడించారు. బొకారో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచారు అధికారులు. పెద్ద పౌల్ట్రీ ఫారమ్ కోళ్లు, బాతుల నమూనాలను పరిశీలించడానికి ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు వ్యాధి సోకిన జోన్లో నివసిస్తున్న వ్యక్తుల నమూనాలను సేకరించాలని వైద్య బృందాన్ని ఆదేశించారు అధికారులు. ఎవరికైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉంటే చికిత్స కోసం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు చికెన్, బాతు మాంసాన్ని తినడం మానేయాలని ప్రజలకు సూచించారు అధికారులు. మనుషుల్లో ఈ వ్యాధి వస్తే.. తీవ్రమైన వెన్నునొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, జలుబు, కఫంలో రక్తం వంటి లక్షణాలు ఉంటాయి.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..