Bihar Politics: ఆర్జేడీ – నితీష్ పొత్తుతో పెరిగిన క్రైం.. బీజేపీ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP criticizes CM Nitish Kumar and RJD alliance: లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో, సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పొత్తు పెట్టుకుని మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం ఎనిమిదో సారి సీఎంగా నితీష్ కుమార్ పదవీ స్వీకారం చేశారు. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టారు. ఇన్నాళ్లు జేడీయూతో పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీగా మారింది. అయితే బీజేపీతో పొత్తును తెంచుకున్న కొన్ని గంటల్లోనే బీహార్ రాష్ట్రంలో నేరాలు పెరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బీహార్ లో మరోసారి గుండా రాజ్ వచ్చిందంటూ విమర్శలు గుప్పిస్తోంది. మహాఘటబంధన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో నేరాలు పెరిగాయని.. గత రెండు రోజులుగా జరిగిన నేరాల జాబితాను విడుదల చేసింది బీజేపీ పార్టీ. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ నేరాల జాబితాను విడుదల చేశారు.
Read Also: KL Rahul: కేఎల్ రాహుల్ వచ్చేశాడు.. ధావన్కు ఎసరు పెట్టేశాడు
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
నేరాలు పెరగడానికే ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారా..? అంటూ నితీష్ కుమార్ ను ప్రశ్నించారు. అత్యాచారం, దోపిడీలు, నేరాలు పెరిగేందుకే నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసి వెళ్లారా..? అని ట్వీట్ చేశారు నిత్యానందరాయ్. అందుకు తగ్గట్లుగానే గత రెండు రోజుల్లో బీహార్ లో పలు కీలక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. నితీష్ కుమార్ రాజీనామా చేసిన రోజున పాట్నాలోని టయోటా షోరూమ్ లో భారీ దోపిడి జరిగింది. రూ. 9 లక్షలను దోచుకున్నారు. సెక్యురిటీ గార్డును కత్తితో పొడిచారు దుండగులు. నితీష్ ప్రమాణానికి కొద్ది గంటల ముందు స్థానిక వార్తాపత్రిక జర్నలిస్టును జాముయులో దుండగులు కిరాతకంగా హత్య చేశారు.
పశ్చిమ చంపారన్ జిల్లా నార్కటియాగంజ్ లో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముజఫర్ నగర్ లోని నలిన్ రంజన్ అనే ఓ వ్యాపారవేత్త ఇంట్లో పగటిపూటనే దోపిడి జరిగింది. ఇదే పాట్నాలోని ఫతుహా, బార్హ్ లో హత్య, దోపిడి, అత్యాచారం వంటి అనేక ఘటనను బీజేపీ నేతలు ప్రస్తావించారు. నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసిన తరువాత క్రైం గ్రాఫ్ పెరిగిపోయిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీహర్ మరోసారి భయం నీడలో బతకాల్సివస్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!