Bihar: సీఎం విచిత్ర ప్రవర్తన.. పూల బొకేను ఆఫీసర్ నెత్తినపెట్టిన నితీష్కుమార్
- సీఎం విచిత్ర ప్రవర్తన
- పూల బొకేను ఆఫీసర్ నెత్తినపెట్టిన నితీష్కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతిథులకు గానీ.. వీఐపీలకు గానీ స్వాగతం పలికేటప్పుడు పూల బొకేలు ఇవ్వడం సాంప్రదాయం. గౌరవం, మర్యాద. పెద్ద స్థాయి వ్యక్తులకు ఇచ్చే గౌరవం ఇది. అధికారులు పూల బొకేలను గానీ.. ఈ మధ్య చిన్న పూల కుండీలు ఇస్తున్నారు. అయితే బీహార్లో వింత సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపైన ఓ అధికారి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు చిన్న పూల కుండీని నితీష్ కుమార్కు ఇచ్చారు. వెంటనే ఆ పూల కుండీని అధికారి నెత్తిపైన పెట్టారు. దీంతో అధికారి అవ్వాక్కయ్యాడు. ఈ సందర్భంగా వేదికపైన ఉన్న వారంతా నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: UP: వికటించిన జుట్టు మార్పిడి శస్త్రచికిత్స.. ఇద్దరు ఇంజనీర్లు మృతి
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
పాట్నాలోని లలిత్ నారాయణ్ మిశ్రా ఇనిస్టిట్యూట్లో సోమవారం అపాయింట్మెంట్ లెటర్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.సిద్ధార్థ పూల కుండీ మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. పూల కుండీ తీసుకున్న ముఖ్యమంత్రి విచిత్రంగా ప్రవర్తించారు. ఆ పూల కుండీని ఆఫీసర్ నెత్తిపైన పెట్టారు. దీంతో అధికారి ఆశ్చర్యపోయాడు. ఇక అక్కడే ఉన్నవారంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Mirai : ‘మిరాయ్’ మరో కార్తికేయ-2 అవుతుందా..?
అయితే ఈ సందర్భం నవ్వులు తెప్పించినా మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలానే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట ట్రెండింగ్ మారాయి. ఇక ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేశారు. ఆయన తీరును ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.
త్వరలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. ఇంకోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా అధికారం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి పోటాపోటీగా ప్రచారం ఉండేటట్టు కనిపిస్తోంది.
#WATCH | Bihar CM Nitish Kumar playfully places a plant on the head of ACS Education and LN Mishra Institute for Social and Economic Change Director Dr. S. Siddharth at an event in Patna. pic.twitter.com/mzvEC3wcwn
— ANI (@ANI) May 26, 2025
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌంట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..