Sonam Raghuvanshi: సోనమ్ కేసులో బిగ్ ట్విస్ట్.. లవ్ ఎఫైర్ గురించి ముందే తెలుసు..
- హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..
- సోనమ్ లవ్ ఎఫైర్ గురించి ఫ్యామిలీకి ముందే తెలుసు..
- అంతా తెలిసే రాజా రఘువంశీతో వివాహం..
- హనీమూన్ పేరుతో భర్తను దారుణంగా చంపించిన సోనమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Raghuvanshi: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి కోసం సోనమ్ రఘువంశీ, తన భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులతో హత్య చేయించింది. మొత్తం మర్డర్ ప్లాన్కి సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్లాన్ చేసినట్లు తేలింది. మే 10న వివాహమైన ఈ జంట, హనీమూన్ కోసం మే 21న మేఘాలయాకు వెళ్లారు. మే 23న రాజా రఘువంశీని ఆకాష్ రాజ్పూత్, వికాస్ అలియాస్ విక్కీ, ఆనంద్లు కలిసి హత్య చేశారు.
అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెళ్లికి ముందే తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు సోనమ్ తన తల్లిదండ్రులకు చెప్పినట్లే తెలిసింది. సోనమ్ రాజ్ కుష్వాహాతో తనకున్న సంబంధం గురించి తన తల్లికి చెప్పినట్లు, మృతుడి అన్నయ్య విపిన్ రఘువంశీ వెల్లడించారు. అయితే, రాజాకు ఇచ్చి తనకు బలవంతంగా వివాహం చేస్తే ఏదైనా విషాదకరమైన సంఘటన జరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించినట్లు చెప్పారు. సోనమ్ కుటుంబం మాత్రం ఆమె ప్రేమను అంగీకరించలేదని, ఆమె వివాహం తమ కులం వారితో జరగాలని పట్టుబట్టినట్లు తెలిసింది.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
READ ALSO: Rajnath Singh: ‘‘పాలకు పిల్లి రక్షణ’’.. యూఎన్ వ్యవహారంపై ఆగ్రహం..
‘‘సోనమ్ కుటుంబానికి దగ్గరి పరిచయం ఉన్న వ్యక్తి, సోనమ్ తన తల్లితో ఆమె లవ్ ఎఫైర్ గురించి చెప్పినట్లు నాకు చెప్పాడు. కానీ ఆమె కుటుంబం నువ్వు ఎవరినైనా ప్రేమించినా, మన కమ్యూనిటీ వ్యక్తితోనే వివాహం జరుగుతుందని చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా జరిగితే నా బాధ్యత లేదని సోనమ్ హెచ్చరించింది’’ అని విపిన్ రఘువంశీ వెల్లడించారు. ‘‘సోనమ్ తనతో మాట్లాడలేదని, ఆమె తనను పట్టించుకోదని రాజా చెప్పేవాడు. ఈ విషయాన్ని అతనే మాకు స్వయంగా చెప్పాడు.’’ అని విపిన్ తెలిపాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య తర్వాత, సోనమ్ మేఘాలయ నుంచి తప్పించుకుని స్వస్థలం ఇండోర్ రావడానికి ప్రయత్నించింది. చివరకు ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్లోని పోలీసుల ముందు లొంగిపోయింది. జూన్ 03న రాజా రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత హత్యగా పోలీసులు గుర్తించారు. భార్య ప్రమేయం తప్పకుండా ఉందని అనుమానించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీస్ వర్గాల ప్రకారం, సోనమ్,రాజ్ కుష్వాహా మధ్య జరిగిన చాటింగ్లలో, వివాహానికి ముందే ఆమె రాజా నుండి మానసికంగా దూరమైందని వెల్లడైంది. ఒక మెసేజ్లో, రాజా తనతో సన్నిహితంగా ఉండటం తనకు అసౌకర్యంగా ఉందని, అతన్ని చంపాలనుకుంటున్నానని ఆమె రాజ్తో చెప్పినట్లు వెల్లడైంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!