Sonam Raghuvanshi: సోనమ్ కేసులో బిగ్ ట్విస్ట్.. లవ్ ఎఫైర్ గురించి ముందే తెలుసు..
- హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..
- సోనమ్ లవ్ ఎఫైర్ గురించి ఫ్యామిలీకి ముందే తెలుసు..
- అంతా తెలిసే రాజా రఘువంశీతో వివాహం..
- హనీమూన్ పేరుతో భర్తను దారుణంగా చంపించిన సోనమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Raghuvanshi: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి కోసం సోనమ్ రఘువంశీ, తన భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులతో హత్య చేయించింది. మొత్తం మర్డర్ ప్లాన్కి సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్లాన్ చేసినట్లు తేలింది. మే 10న వివాహమైన ఈ జంట, హనీమూన్ కోసం మే 21న మేఘాలయాకు వెళ్లారు. మే 23న రాజా రఘువంశీని ఆకాష్ రాజ్పూత్, వికాస్ అలియాస్ విక్కీ, ఆనంద్లు కలిసి హత్య చేశారు.
అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెళ్లికి ముందే తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు సోనమ్ తన తల్లిదండ్రులకు చెప్పినట్లే తెలిసింది. సోనమ్ రాజ్ కుష్వాహాతో తనకున్న సంబంధం గురించి తన తల్లికి చెప్పినట్లు, మృతుడి అన్నయ్య విపిన్ రఘువంశీ వెల్లడించారు. అయితే, రాజాకు ఇచ్చి తనకు బలవంతంగా వివాహం చేస్తే ఏదైనా విషాదకరమైన సంఘటన జరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించినట్లు చెప్పారు. సోనమ్ కుటుంబం మాత్రం ఆమె ప్రేమను అంగీకరించలేదని, ఆమె వివాహం తమ కులం వారితో జరగాలని పట్టుబట్టినట్లు తెలిసింది.
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
READ ALSO: Rajnath Singh: ‘‘పాలకు పిల్లి రక్షణ’’.. యూఎన్ వ్యవహారంపై ఆగ్రహం..
‘‘సోనమ్ కుటుంబానికి దగ్గరి పరిచయం ఉన్న వ్యక్తి, సోనమ్ తన తల్లితో ఆమె లవ్ ఎఫైర్ గురించి చెప్పినట్లు నాకు చెప్పాడు. కానీ ఆమె కుటుంబం నువ్వు ఎవరినైనా ప్రేమించినా, మన కమ్యూనిటీ వ్యక్తితోనే వివాహం జరుగుతుందని చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా జరిగితే నా బాధ్యత లేదని సోనమ్ హెచ్చరించింది’’ అని విపిన్ రఘువంశీ వెల్లడించారు. ‘‘సోనమ్ తనతో మాట్లాడలేదని, ఆమె తనను పట్టించుకోదని రాజా చెప్పేవాడు. ఈ విషయాన్ని అతనే మాకు స్వయంగా చెప్పాడు.’’ అని విపిన్ తెలిపాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య తర్వాత, సోనమ్ మేఘాలయ నుంచి తప్పించుకుని స్వస్థలం ఇండోర్ రావడానికి ప్రయత్నించింది. చివరకు ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్లోని పోలీసుల ముందు లొంగిపోయింది. జూన్ 03న రాజా రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత హత్యగా పోలీసులు గుర్తించారు. భార్య ప్రమేయం తప్పకుండా ఉందని అనుమానించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీస్ వర్గాల ప్రకారం, సోనమ్,రాజ్ కుష్వాహా మధ్య జరిగిన చాటింగ్లలో, వివాహానికి ముందే ఆమె రాజా నుండి మానసికంగా దూరమైందని వెల్లడైంది. ఒక మెసేజ్లో, రాజా తనతో సన్నిహితంగా ఉండటం తనకు అసౌకర్యంగా ఉందని, అతన్ని చంపాలనుకుంటున్నానని ఆమె రాజ్తో చెప్పినట్లు వెల్లడైంది.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!