Bengaluru: బెంగళూర్లో దంచికొడుతున్న ఎండలు.. ఏడేళ్ల గరిష్టానికి ఉష్ణోగ్రతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: వర్షాభావ పరిస్థితులు, నీటి కొరతతో సతమవుతున్న బెంగళూర్ నగరాన్ని ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు వేధిస్తున్నాయి. నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. నీటి సంక్షోభం మధ్య, ప్రస్తుతం నగరంలో వడగాలులు, ఉష్ణోగ్రతలు ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నగరంలో మార్చి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రం (KSNDMC) ప్రకారం.. ఈ ఏడాది ఉష్ణోగ్రతల పెరుగుదల అసాధారణంగా ఉందని, గత ఏడేళ్లలో ఈ ఏడాది రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. మార్చి 28, 2024న బెంగళూర్లో ఏకంగా 37.9 డిగ్రీ సెల్సియస్కి ఉష్ణోగ్రత చేరుకుంది. గతేడాది ఇదే రోజు 37.5 డిగ్రీలుగా ఉంది.
Read Also: karnataka: జేడీఎస్ అభ్యర్థుల ప్రకటన.. కుమారస్వామి ఎక్కడి నుంచంటే..!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఈ ఆకస్మిక ఉష్ణోగ్రతలకు అనేక అంశాలు దోహదపడుతున్నాయి. రుతుపవనాలకు ముందు ఈ ఏడాది వర్షాలు లేకపోవడం, వేగవంతమైన పట్టణీకరణ, పెరిగిన కాంక్రీట్ నిర్మాణాల కారణంగా ఏర్పడే అర్బన్ హీర్ ఐలాండ్ ప్రభావం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందువల్ల నివాసితులు ఇంట్లోనే ఉండాలని, తగినంత నీరు తీసుకోవాలని హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని, సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయాల్లో బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండటం మరియు తేలికైన, శ్వాసక్రియకు అనువుగా ఉండే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయాల్లో బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండటం మరియు తేలికైన, శ్వాసక్రియకు అనువుగా ఉండే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని KSNDMC కోరింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో బెంగళూర్ నగరంలో నీటి సంక్షోభం మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధికారులు నీటి దుర్వినియోగంపై చర్యలు తీసుకుంటున్నారు. నీటిని వృథా చేసినవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. మరోవైపు రుతుపవనాలు రావాలంటే మరో రెండు నెలలు ఉండటంతో బెంగళూర్ వాసుల కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!