Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..
- బెంగాల్ ఎన్నికల్లో సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..
- బీజేేపీతో డీల్, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు..
- పొత్తును రద్దు చేసుకున్న ఎంఐఎం..
- ఇదంతా టీఎంసీ కుట్ర అని కబీర్ ఆరోపణలు..
Bengal Elections: బెంగాల్ రాజకీయాల్లో హుమాయున్ కబీర్ వీడియో సంచలనంగా మారింది. బెంగాల్లోని ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, బీజేపీతో తనకు డీల్ ఉందని చెబుతున్నట్లుగా వీడియో చూపిస్తుంది. కబీర్కు బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియోలను విడుదల చేసింది. అయితే, ఈ వీడియో ఏఐతో క్రియేట్ చేసిందని, ముస్లిం ఓటర్లను తన నుంచి దూరం చేసేందుకు టీఎంసీ ఎత్తుగడ అని కబీర్ ఆరోపించారు. టీఎంసీపై పరువునష్టం కేసు పెడతానని హెచ్చరించారు.
అయితే, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐంఎం పార్టీ కబీర్ పార్టీతో పొత్తుకు నిరాకరించింది. అంతకుముందు, ఈ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తనను ఓడించడమే పీఎంఓ ఏకైక లక్ష్యమని అన్నారు. బీజేపీతో డీల్ ఉందని చెబుతున్నట్లు చూపిస్తున్న వీడియోపై అమిత్ షాను ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు నిర్మించే వారితో కలవడం కన్నా 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పారు.
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
Read Also: Telangana Intermediate Second Year Results 2026
ఈ వీడియోలో హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. ముస్లింలను మోసం చేయడం సులభమని, బాబ్రీ అంశాన్ని ప్రస్తావించడం, రూ. 200 కోట్ల ముందస్తు నిధుల్ని డిమాండ్ చేయడం వంటి కామెంట్స్ చేశారు. టీఎంసీని దెబ్బతీసే విధంగా మైనారిటీ ఓట్లను తన వైపు తిప్పుకునేలా, దీని ద్వారా బీజేపీకి ప్రయోజనం చేకూరేలా తన వ్యూహాన్ని కబీర్ వివరిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఆయన రూ. 1000 కోట్ల గురించి ప్రస్తావించడం ఇందులో ఉంది. దీంట్లో రూ. 200 కోట్ల అడ్వాన్స్ పొందినట్లు ఆయన చెబుతున్నట్లు వీడియో చూపించింది. కబీర్ ప్రధాని మోడీ, అమిత్ షా, మఖ్యమంత్రులు మోహన్ యాదవ్, హిమంత బిశ్వ శర్మ పేర్లను ప్రస్తావిస్తున్నట్లు ఉంది.
అయితే, ఈ ఆరోపణల్ని కబీర్ ఖండించారు. నవంబర్ 2019 నుంచి తనకు ఏ బీజేపీ నేతతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పార్టీ నాయకులు కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీమ్లు ఒక ‘బూటకపు’ స్టింగ్ ఆపరేషన్ను నడిపించారని ఆయన ఆరోపించారు. వారు తన ప్రతిష్ట దెబ్బ తీయడానికి ఏఐని వాడుకున్నారని చెప్పారు. ఈ ఆరోపణలతో తప్పుదోవ పట్టొద్దని ముస్లింలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ముస్లిం ఓట్లు కోల్పోతామనే భయంతో తనను అప్రతిష్టపాలు చేయాలని టీఎంసీ పన్నిన కుట్ర ఇదని, ఈ నకిలీ వీడియో ముస్లింల మనోభావాలను కూడా అవమానించిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో