Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..
- బెంగాల్ ఎన్నికల్లో సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..
- బీజేేపీతో డీల్, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు..
- పొత్తును రద్దు చేసుకున్న ఎంఐఎం..
- ఇదంతా టీఎంసీ కుట్ర అని కబీర్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Elections: బెంగాల్ రాజకీయాల్లో హుమాయున్ కబీర్ వీడియో సంచలనంగా మారింది. బెంగాల్లోని ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, బీజేపీతో తనకు డీల్ ఉందని చెబుతున్నట్లుగా వీడియో చూపిస్తుంది. కబీర్కు బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియోలను విడుదల చేసింది. అయితే, ఈ వీడియో ఏఐతో క్రియేట్ చేసిందని, ముస్లిం ఓటర్లను తన నుంచి దూరం చేసేందుకు టీఎంసీ ఎత్తుగడ అని కబీర్ ఆరోపించారు. టీఎంసీపై పరువునష్టం కేసు పెడతానని హెచ్చరించారు.
అయితే, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐంఎం పార్టీ కబీర్ పార్టీతో పొత్తుకు నిరాకరించింది. అంతకుముందు, ఈ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తనను ఓడించడమే పీఎంఓ ఏకైక లక్ష్యమని అన్నారు. బీజేపీతో డీల్ ఉందని చెబుతున్నట్లు చూపిస్తున్న వీడియోపై అమిత్ షాను ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు నిర్మించే వారితో కలవడం కన్నా 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పారు.
Also Read
Read Also: Telangana Intermediate Second Year Results 2026
ఈ వీడియోలో హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. ముస్లింలను మోసం చేయడం సులభమని, బాబ్రీ అంశాన్ని ప్రస్తావించడం, రూ. 200 కోట్ల ముందస్తు నిధుల్ని డిమాండ్ చేయడం వంటి కామెంట్స్ చేశారు. టీఎంసీని దెబ్బతీసే విధంగా మైనారిటీ ఓట్లను తన వైపు తిప్పుకునేలా, దీని ద్వారా బీజేపీకి ప్రయోజనం చేకూరేలా తన వ్యూహాన్ని కబీర్ వివరిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఆయన రూ. 1000 కోట్ల గురించి ప్రస్తావించడం ఇందులో ఉంది. దీంట్లో రూ. 200 కోట్ల అడ్వాన్స్ పొందినట్లు ఆయన చెబుతున్నట్లు వీడియో చూపించింది. కబీర్ ప్రధాని మోడీ, అమిత్ షా, మఖ్యమంత్రులు మోహన్ యాదవ్, హిమంత బిశ్వ శర్మ పేర్లను ప్రస్తావిస్తున్నట్లు ఉంది.
అయితే, ఈ ఆరోపణల్ని కబీర్ ఖండించారు. నవంబర్ 2019 నుంచి తనకు ఏ బీజేపీ నేతతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పార్టీ నాయకులు కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీమ్లు ఒక ‘బూటకపు’ స్టింగ్ ఆపరేషన్ను నడిపించారని ఆయన ఆరోపించారు. వారు తన ప్రతిష్ట దెబ్బ తీయడానికి ఏఐని వాడుకున్నారని చెప్పారు. ఈ ఆరోపణలతో తప్పుదోవ పట్టొద్దని ముస్లింలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ముస్లిం ఓట్లు కోల్పోతామనే భయంతో తనను అప్రతిష్టపాలు చేయాలని టీఎంసీ పన్నిన కుట్ర ఇదని, ఈ నకిలీ వీడియో ముస్లింల మనోభావాలను కూడా అవమానించిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!