Suvendu: మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
- మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
- మైనారిటీ మోర్చా అవసరం లేదని వ్యాఖ్య
- తన వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించినవి కావని సవరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనారిటీ మోర్చాపై పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మైనారిటీ కమ్యూనిటీ నుంచి మద్దతు లభించలేదని.. అందుకే బీజేపీ సీట్లు గెలవలేకపోయిందన్నారు. దీంతో ఆయన ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ అనవసరమన్నారు. దీనికి బదులుగా ‘హమ్ ఉంకే సాథ్ జో హుమారే సాథ్’ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలు బీజేపీతో లేనప్పుడు మైనారిటీ మోర్చా అవసరం లేదని పేర్కొ్న్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యకర్త సమావేశంలో సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల సమయంలో చాలా ప్రాంతాల్లో టీఎంసికి చెందిన జిహాదీ గూండాలు హిందువులు ఓటు వేయడానికి అనుమతించలేదని సువేంద్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం సాధ్యం కాదన్నారు. టీఎంసీకి చెందిన జిహాదీ గూండాలు అనుమతించరని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయన్నారు. అప్పుడే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
Also Read
పశ్చిమ బెంగాల్లో మైనారిటీ ఓటర్లు 30 శాతం మంది ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో దక్షిణ పశ్చిమ బెంగాల్లో మైనారిటీ ఓట్లు టీఎంసీకి పడ్డాయి. ఉత్తరాన మాత్రం వామపక్షాలు-కాంగ్రెస్ ఓట్ల విభజనతో మాత్రం బీజేపీకి లాభించింది.
ఇక గత వారం జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసి మూడు అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ నైరాశంలో పడింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు గెలిస్తే.. 2024లో 12 స్థానాలే సొంతం చేసుకుంది. ఇక సువేందు వ్యాఖ్యాలు వివాదాస్పదం కావడంతో తన వ్యాఖ్యలు ఏ వర్గాన్ని ఉద్దేశించినవి కావని తెలిపారు.
My statement is being taken out of context. I am clear that those who are Nationalists, stand for this Nation and Bengal, we should be with them. Those who don’t stand with us, work against the interest of Nation and Bengal, we need to expose them. Also, like Mamata Banerjee, we…
— Suvendu Adhikari (@SuvenduWB) July 17, 2024
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!