Suvendu: మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
- మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
- మైనారిటీ మోర్చా అవసరం లేదని వ్యాఖ్య
- తన వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించినవి కావని సవరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనారిటీ మోర్చాపై పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మైనారిటీ కమ్యూనిటీ నుంచి మద్దతు లభించలేదని.. అందుకే బీజేపీ సీట్లు గెలవలేకపోయిందన్నారు. దీంతో ఆయన ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ అనవసరమన్నారు. దీనికి బదులుగా ‘హమ్ ఉంకే సాథ్ జో హుమారే సాథ్’ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలు బీజేపీతో లేనప్పుడు మైనారిటీ మోర్చా అవసరం లేదని పేర్కొ్న్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యకర్త సమావేశంలో సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల సమయంలో చాలా ప్రాంతాల్లో టీఎంసికి చెందిన జిహాదీ గూండాలు హిందువులు ఓటు వేయడానికి అనుమతించలేదని సువేంద్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం సాధ్యం కాదన్నారు. టీఎంసీకి చెందిన జిహాదీ గూండాలు అనుమతించరని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయన్నారు. అప్పుడే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
పశ్చిమ బెంగాల్లో మైనారిటీ ఓటర్లు 30 శాతం మంది ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో దక్షిణ పశ్చిమ బెంగాల్లో మైనారిటీ ఓట్లు టీఎంసీకి పడ్డాయి. ఉత్తరాన మాత్రం వామపక్షాలు-కాంగ్రెస్ ఓట్ల విభజనతో మాత్రం బీజేపీకి లాభించింది.
ఇక గత వారం జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసి మూడు అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ నైరాశంలో పడింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు గెలిస్తే.. 2024లో 12 స్థానాలే సొంతం చేసుకుంది. ఇక సువేందు వ్యాఖ్యాలు వివాదాస్పదం కావడంతో తన వ్యాఖ్యలు ఏ వర్గాన్ని ఉద్దేశించినవి కావని తెలిపారు.
My statement is being taken out of context. I am clear that those who are Nationalists, stand for this Nation and Bengal, we should be with them. Those who don’t stand with us, work against the interest of Nation and Bengal, we need to expose them. Also, like Mamata Banerjee, we…
— Suvendu Adhikari (@SuvenduWB) July 17, 2024
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!