Suvendu: మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
- మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
- మైనారిటీ మోర్చా అవసరం లేదని వ్యాఖ్య
- తన వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించినవి కావని సవరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనారిటీ మోర్చాపై పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మైనారిటీ కమ్యూనిటీ నుంచి మద్దతు లభించలేదని.. అందుకే బీజేపీ సీట్లు గెలవలేకపోయిందన్నారు. దీంతో ఆయన ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ అనవసరమన్నారు. దీనికి బదులుగా ‘హమ్ ఉంకే సాథ్ జో హుమారే సాథ్’ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలు బీజేపీతో లేనప్పుడు మైనారిటీ మోర్చా అవసరం లేదని పేర్కొ్న్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యకర్త సమావేశంలో సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల సమయంలో చాలా ప్రాంతాల్లో టీఎంసికి చెందిన జిహాదీ గూండాలు హిందువులు ఓటు వేయడానికి అనుమతించలేదని సువేంద్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం సాధ్యం కాదన్నారు. టీఎంసీకి చెందిన జిహాదీ గూండాలు అనుమతించరని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయన్నారు. అప్పుడే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో మైనారిటీ ఓటర్లు 30 శాతం మంది ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో దక్షిణ పశ్చిమ బెంగాల్లో మైనారిటీ ఓట్లు టీఎంసీకి పడ్డాయి. ఉత్తరాన మాత్రం వామపక్షాలు-కాంగ్రెస్ ఓట్ల విభజనతో మాత్రం బీజేపీకి లాభించింది.
ఇక గత వారం జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసి మూడు అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ నైరాశంలో పడింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు గెలిస్తే.. 2024లో 12 స్థానాలే సొంతం చేసుకుంది. ఇక సువేందు వ్యాఖ్యాలు వివాదాస్పదం కావడంతో తన వ్యాఖ్యలు ఏ వర్గాన్ని ఉద్దేశించినవి కావని తెలిపారు.
My statement is being taken out of context. I am clear that those who are Nationalists, stand for this Nation and Bengal, we should be with them. Those who don’t stand with us, work against the interest of Nation and Bengal, we need to expose them. Also, like Mamata Banerjee, we…
— Suvendu Adhikari (@SuvenduWB) July 17, 2024
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!