Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం దూకుడు
- 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- ఎక్స్లో పేర్కొన్న అమిత్ మాల్వీయా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే చకచకా పనులు జరిగిపోతున్నాయి. తాజాగా కోల్కతా మెట్రో ఆరెంజ్ లైన్లోని చింగ్రిఘాట క్రాసింగ్ సెక్షన్లో గత టీఎంసీ ప్రభుత్వం హయాంలో 15 ఏళ్లు ఆలస్యమైన గర్డర్ లాంచింగ్ పనులను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 15 రోజుల్లోనే పూర్తి చేసిందని బీజేపీకి చెందిన అమిత్ మాల్వీయా తెలిపారు. 366 మీటర్ల పొడవున్న ఈ అసంపూర్ణ మార్గం కోల్కతా దక్షిణ శివారు ప్రాంతాలను సెక్టార్ Vతో కలుపుతుందని అన్నారు. ఆర్వీఎన్ఎల్ ఈ పనిని వరుసగా రెండు వారాంతాల్లో పూర్తి చేసిందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో పేర్కొన్నారు.
Also Read
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Ratna Debnath: 'నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది'.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
- K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
‘‘మమతా బెనర్జీ 15 ఏళ్లలో చేయలేని పనిని సువేందు అధికారి, బీజేపీ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే పూర్తిచేశారు. కోల్కతా మెట్రో ఆరెంజ్ లైన్లోని చింగ్రిఘాట క్రాసింగ్ సెక్షన్ దగ్గర చాలాకాలంగా ఆలస్యమైన గర్డర్ లాంచింగ్ పనులను ఆర్విఎన్ఎల్ (RVNL) నిర్ణీత గడువు కంటే ముందే విజయవంతంగా పూర్తి చేసింది. కోల్కతా దక్షిణ శివారు ప్రాంతాలను సెక్టార్ Vలోని ఐటీ హబ్తో అనుసంధానించే న్యూ గరియా-ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ను పూర్తి చేయడానికి.. ఈ 366 మీటర్ల లోపించిన భాగం చాలా కీలకం. ఈ ప్రాజెక్ట్ సంవత్సరాల తరబడి ఎందుకు నిలిచిపోయింది?, ఎందుకంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ట్రాఫిక్ మళ్లింపునకు పదేపదే అనుమతి నిరాకరించింది. పనిని పూర్తి చేయడానికి ఆర్విఎన్ఎల్ కేవలం వరుసగా రెండు వారాంతాల పాటు రాత్రిపూట ట్రాఫిక్ దిగ్బంధనాలకు మాత్రమే అనుమతి కోరింది. రాజకీయ అడ్డంకి తొలగిపోయిన వెంటనే పనులు వేగవంతమయ్యాయి. సంవత్సరాలుగా, ఈ ఆలస్యాలకు కారణం “సాంకేతిక కారణాలే” అని బెంగాల్ ప్రజలకు చెబుతూ వచ్చారు. కానీ, అసలు అతిపెద్ద సాంకేతిక సమస్య టీఎంసీ ప్రభుత్వమే అని తేలింది.’’ అని రాసుకొచ్చారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అనంతరం సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర మద్దతుతో బెంగాల్ లో పనులు వేగవంతం అయ్యాయి.
What Mamata Banerjee couldn’t do in 15 years, Suvendu Adhikari and the BJP government have delivered in just 15 days.
🚇 RVNL has successfully completed the long-delayed girder launching work at the Chingrighata crossing section of Kolkata Metro’s Orange Line, ahead of schedule.… pic.twitter.com/JWI8IL2wbV
— Amit Malviya (@amitmalviya) May 25, 2026
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?