Mahendra Singh Dhoni: ధోనీకి ఊరట.. నిర్దోషిగా తేల్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Relief to Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఊరట లభించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో బెగుసరాయ్ న్యాయస్థానం ధోనితో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోని ప్రమోటర్ గా ఉన్న ఓ ఎరువుల కంపెనీపై ఓ ఎంటర్ ప్రైజెస్ సంస్థ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. మార్కెటింగ్ హెడ్ అజయ్ కుమార్, ఇమ్రాన్ బిన్ జాఫర్, మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర సింగ్ ధోనీ సహా ఎనిమిది మంది వ్యక్తులు చెక్ బౌన్స్ కేసులో బుక్ అయ్యారు. అయితే తాజాగా ఈ కేసులో ధోని తరుపున న్యాయవాది గోపాల్ కుమార్ జూలై 27న వాదనలను వినిపించారు. చెక్ బౌన్స్ కేసులో ధోనికి ఎలాంటి ప్రమేయం లేదని.. ధోని కంపెనీ చైర్మన్ కానీ, బోర్డ్ డైరెక్టర్ కాదని కోర్టుకు తన వాదనలను వినిపించారు. ఈ కేసులో ఎంఎస్ ధోనికి ఎలాంటి ప్రమేయం లేదనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ధోనితో పాటు నలుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.
Read Also: PM Modi 91st Mann Ki Baat: ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను మీ..డీపీగా మార్చుకోండి
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
టీమిండియా కెప్టెన్ గా ధోని ఉన్న సమయంలో బీహార్ కు చెందిన ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి ప్రమోటర్ గా వ్యవహరించారు. ఈ సంస్థ నుంచి మరో సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. అయితే ఆ ఉత్పత్తుల్లో నాణ్యత కొరవడిందని.. కొనుగోలు చేసిన సంస్థ ఆరోపించడంతో సదరు ఫెర్టిలైజర్ కంపెనీ ఆ ఎరువులను తిరిగి వెనక్కి తీసుకుని రూ. 30 లక్షల చెక్కులను అందించింది. అయితే ఆ చెక్కులను బ్యాంకులో వేయగా.. అది బౌన్స్ అయింది. దీంతో కంపెనీకి ప్రమోటర్ గా ఉన్న ధోనితో పాటు మరికొంతమందికి సదరు సంస్థ లీగల్ నోటీసులు పంపింది. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఇందులో మహేంద్ర సింగ్ ధోని పేరును కూడా చేర్చారు. తాజాగా బెగుసరాయ్ కోర్టు ధోనిని నిర్దోషిగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!