Mahendra Singh Dhoni: ధోనీకి ఊరట.. నిర్దోషిగా తేల్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Relief to Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఊరట లభించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో బెగుసరాయ్ న్యాయస్థానం ధోనితో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోని ప్రమోటర్ గా ఉన్న ఓ ఎరువుల కంపెనీపై ఓ ఎంటర్ ప్రైజెస్ సంస్థ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. మార్కెటింగ్ హెడ్ అజయ్ కుమార్, ఇమ్రాన్ బిన్ జాఫర్, మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర సింగ్ ధోనీ సహా ఎనిమిది మంది వ్యక్తులు చెక్ బౌన్స్ కేసులో బుక్ అయ్యారు. అయితే తాజాగా ఈ కేసులో ధోని తరుపున న్యాయవాది గోపాల్ కుమార్ జూలై 27న వాదనలను వినిపించారు. చెక్ బౌన్స్ కేసులో ధోనికి ఎలాంటి ప్రమేయం లేదని.. ధోని కంపెనీ చైర్మన్ కానీ, బోర్డ్ డైరెక్టర్ కాదని కోర్టుకు తన వాదనలను వినిపించారు. ఈ కేసులో ఎంఎస్ ధోనికి ఎలాంటి ప్రమేయం లేదనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ధోనితో పాటు నలుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.
Read Also: PM Modi 91st Mann Ki Baat: ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను మీ..డీపీగా మార్చుకోండి
Also Read
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
టీమిండియా కెప్టెన్ గా ధోని ఉన్న సమయంలో బీహార్ కు చెందిన ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి ప్రమోటర్ గా వ్యవహరించారు. ఈ సంస్థ నుంచి మరో సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. అయితే ఆ ఉత్పత్తుల్లో నాణ్యత కొరవడిందని.. కొనుగోలు చేసిన సంస్థ ఆరోపించడంతో సదరు ఫెర్టిలైజర్ కంపెనీ ఆ ఎరువులను తిరిగి వెనక్కి తీసుకుని రూ. 30 లక్షల చెక్కులను అందించింది. అయితే ఆ చెక్కులను బ్యాంకులో వేయగా.. అది బౌన్స్ అయింది. దీంతో కంపెనీకి ప్రమోటర్ గా ఉన్న ధోనితో పాటు మరికొంతమందికి సదరు సంస్థ లీగల్ నోటీసులు పంపింది. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఇందులో మహేంద్ర సింగ్ ధోని పేరును కూడా చేర్చారు. తాజాగా బెగుసరాయ్ కోర్టు ధోనిని నిర్దోషిగా ప్రకటించింది.
తాజావార్తలు
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?