Mahendra Singh Dhoni: ధోనీకి ఊరట.. నిర్దోషిగా తేల్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Relief to Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఊరట లభించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో బెగుసరాయ్ న్యాయస్థానం ధోనితో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోని ప్రమోటర్ గా ఉన్న ఓ ఎరువుల కంపెనీపై ఓ ఎంటర్ ప్రైజెస్ సంస్థ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. మార్కెటింగ్ హెడ్ అజయ్ కుమార్, ఇమ్రాన్ బిన్ జాఫర్, మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర సింగ్ ధోనీ సహా ఎనిమిది మంది వ్యక్తులు చెక్ బౌన్స్ కేసులో బుక్ అయ్యారు. అయితే తాజాగా ఈ కేసులో ధోని తరుపున న్యాయవాది గోపాల్ కుమార్ జూలై 27న వాదనలను వినిపించారు. చెక్ బౌన్స్ కేసులో ధోనికి ఎలాంటి ప్రమేయం లేదని.. ధోని కంపెనీ చైర్మన్ కానీ, బోర్డ్ డైరెక్టర్ కాదని కోర్టుకు తన వాదనలను వినిపించారు. ఈ కేసులో ఎంఎస్ ధోనికి ఎలాంటి ప్రమేయం లేదనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ధోనితో పాటు నలుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.
Read Also: PM Modi 91st Mann Ki Baat: ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను మీ..డీపీగా మార్చుకోండి
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
టీమిండియా కెప్టెన్ గా ధోని ఉన్న సమయంలో బీహార్ కు చెందిన ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి ప్రమోటర్ గా వ్యవహరించారు. ఈ సంస్థ నుంచి మరో సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. అయితే ఆ ఉత్పత్తుల్లో నాణ్యత కొరవడిందని.. కొనుగోలు చేసిన సంస్థ ఆరోపించడంతో సదరు ఫెర్టిలైజర్ కంపెనీ ఆ ఎరువులను తిరిగి వెనక్కి తీసుకుని రూ. 30 లక్షల చెక్కులను అందించింది. అయితే ఆ చెక్కులను బ్యాంకులో వేయగా.. అది బౌన్స్ అయింది. దీంతో కంపెనీకి ప్రమోటర్ గా ఉన్న ధోనితో పాటు మరికొంతమందికి సదరు సంస్థ లీగల్ నోటీసులు పంపింది. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఇందులో మహేంద్ర సింగ్ ధోని పేరును కూడా చేర్చారు. తాజాగా బెగుసరాయ్ కోర్టు ధోనిని నిర్దోషిగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!