Bangladesh: భారత్ షేక్ హసీనాని అప్పగించాలి, లేదంటే.. బంగ్లాదేశ్ వార్నింగ్..
- షేక్ హసీనాను మాకు అప్పగించాలి..
- ఇండియాను కోరిన బంగ్లాదేశ్ నేత..
- లేకుంటే తీవ్ర నిరసన తెలియజేస్తామంటూ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురువారం ఆమెకు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనల్లో షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు, పలువురి చావుకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో అక్కడి పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
ఇదిలా ఉంటే, హసీనాను అప్పటించే ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంటే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని బంగ్లాదేశ్ హెచ్చరించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయ సలహాదారుగా ఉన్న ఆసిఫ్ నజ్రుల్ ఈ మేరకు భారత్ని హెచ్చరిస్తూ కామెంట్స్ చేశారు. నవంబర్ 18లోగా హసీనాతో పాటు 45 మంది సహ నిందితులను హాజరుపరచాలని అక్కడి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆసిఫ్ గురువారం మాట్లాడారు. తమకు చాలా చట్టపరమైన ఏర్పాట్లు ఉంటాయని, అయితే “భారత్ దీన్ని నిజాయితీగా అర్థం చేసుకుంటే, హసీనా (బంగ్లాదేశ్కు) తిరిగి రావడానికి భారతదేశం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది” అని అన్నారు. భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఇప్పటికే నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరిందని చెప్పారు.
Also Read
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
Read Also: Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు.. ఈ రోజు 6 ఇండిగో విమానాలకు బెదిరింపులు..
విచారణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హసీనాని తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారికంగా కోరుతుందని నజ్రుల్ గత నెలలో మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే, హసీనాకు ఆశ్రయం కల్పించడం ఒక హంతకుడికి, నేరస్థుడికి ఆశ్రయం కల్పించినట్లేనని హసీనా ప్రధాన ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ జాయింట్ సెక్రటరీ జనరల్ అడ్వకేట్ రుహుల్ కబీర్ రిజ్వీ అన్నారు. దౌత్యప్రక్రియ ద్వారా ఆమెను మేము బంగ్లాదేశ్కి తీసుకురావాల్సి ఉందని, ఆమె దాదాపుగా 200 కేసుల్ని ఎదుర్కొంటోందని చెప్పారు. హసీనా ప్రభుత్వ పతనం తరువాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో వందలాది మంది మరణించారు, జూలై మధ్యలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి మరణించిన వారి సంఖ్య 1,000 కంటే ఎక్కువగా ఉంది.
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..