Bangladeh Elections: ముగ్గురు భారత వ్యతిరేక ఉగ్రవాదులు.. బంగ్లా ఎన్నికల్లో ఘన విజయం..
- బంగ్లా ఎన్నికల్లో గెలిచిన భారత వ్యతిరేక ఉగ్రవాదులు..
- మరణశిక్ష కేసుల్లో ఉన్న వ్యక్తులకు యూనస్ ఉపశమనం..
- తాజా ఎన్నికల్లో గెలిచి, బంగ్లా పార్లమెంట్లోకి ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladeh Elections: బంగ్లాదేశ్ ఎన్నికల్లో మతోన్మాదులు, భారత వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు కూడా గెలుపొందారు. ఇందులో ఇద్దరు అధికారం చేపట్టబోయే బీఎన్పీ పార్టీ నుంచి గెలుపొందారు. ఒకరు జమాతే ఇస్లామీ నుంచి గెలిచారు. షేక్ హసీనా పాలన సమయంలో వీరి ముగ్గురిపై మరణశిక్షతో సహా అనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే, మహ్మద్ యూనస్ తాత్కాలిక పాలకుడయ్యాక వీరిపై ఉన్న అన్ని ఆరోపణల్ని తొలగించాడు.
బీఎన్పీ నాయకుల్లో ఇద్దరు లుట్పోజ్జామాన్ బాబార్, అబ్దుస్ సలాం పింటు, జమాతే నుంచి ఏటీఎం అజరుల్ ఇస్లాం గెలుపొందారు. భారత వ్యతిరేకత కలిగిన వీరు ఇప్పుడు బంగ్లా పార్లమెంట్కు వెళ్తున్నారు. ఆగస్టు 21, 2004న షేక్ హసీనాను లక్ష్యంగా చేసుకుని జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించిన రెండు కేసుల్లో తారిక్ రెహమాన్, లుట్ఫోజ్జామాన్ బాబర్, ఇతరులను డిసెంబర్ 2024లో, బంగ్లాదేశ్ హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ ఘటనలో హసీనా తృటిలో తప్పించుకున్నారు. 24 మంది మరణించారు.ః
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also: Ireland vs Oman: ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఒమన్
ఇక బీఎన్పీ నేత అబ్దుస్ సలాం పింటు భారత్ దృష్టిలో చాలా ముఖ్యం. ఇతడికి కూడా యూనస్ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 2006లో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని కోర్టు ఆవరణలో, 2007లో అజ్మీర్ షరీఫ్ దర్గాలో మరియు 2011లో ఢిల్లీలో జరిగిన పేలుళ్లతో సహా భారతదేశంలో జరిగిన దాడులకు వెనుక ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామి (హుజీ)కి పింటు మద్దతు ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. పింటు 2 లక్షల ఓట్ల తేడాతో గెలిచాడు.
మూడో వ్యక్తి ఏటీఎం అజరుల్ ఇస్లాం, దీర్ఘకాలికంగా జమాత్ పార్టీలో పనిచేస్తున్నాడు. 1971 విముక్తి యుద్ధంలో 1200 మందికి పైగా మరణాలు, 13 అత్యాచార కేసులో ఇతను నిందితుడు. 2014లో ఇతడికి మరణశిక్ష విధించారు. యూనస్ సర్కార్ ఇతడిని కూడా నిర్దోషిగా విడుదల చేసింది. ఇవన్నీ ఒక వైపు ఉంచితే, ప్రస్తుతం తారిఖ్ రెహ్మాన్ బంగ్లా ప్రధాని కాబోతున్నారు. భారత్ సంబంధాల దృష్ట్యా ఇతని ఎన్నిక కీలకంగా మారింది. రానున్న కాలంలో భారత్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!