Bangladeh Elections: ముగ్గురు భారత వ్యతిరేక ఉగ్రవాదులు.. బంగ్లా ఎన్నికల్లో ఘన విజయం..
- బంగ్లా ఎన్నికల్లో గెలిచిన భారత వ్యతిరేక ఉగ్రవాదులు..
- మరణశిక్ష కేసుల్లో ఉన్న వ్యక్తులకు యూనస్ ఉపశమనం..
- తాజా ఎన్నికల్లో గెలిచి, బంగ్లా పార్లమెంట్లోకి ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladeh Elections: బంగ్లాదేశ్ ఎన్నికల్లో మతోన్మాదులు, భారత వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు కూడా గెలుపొందారు. ఇందులో ఇద్దరు అధికారం చేపట్టబోయే బీఎన్పీ పార్టీ నుంచి గెలుపొందారు. ఒకరు జమాతే ఇస్లామీ నుంచి గెలిచారు. షేక్ హసీనా పాలన సమయంలో వీరి ముగ్గురిపై మరణశిక్షతో సహా అనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే, మహ్మద్ యూనస్ తాత్కాలిక పాలకుడయ్యాక వీరిపై ఉన్న అన్ని ఆరోపణల్ని తొలగించాడు.
బీఎన్పీ నాయకుల్లో ఇద్దరు లుట్పోజ్జామాన్ బాబార్, అబ్దుస్ సలాం పింటు, జమాతే నుంచి ఏటీఎం అజరుల్ ఇస్లాం గెలుపొందారు. భారత వ్యతిరేకత కలిగిన వీరు ఇప్పుడు బంగ్లా పార్లమెంట్కు వెళ్తున్నారు. ఆగస్టు 21, 2004న షేక్ హసీనాను లక్ష్యంగా చేసుకుని జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించిన రెండు కేసుల్లో తారిక్ రెహమాన్, లుట్ఫోజ్జామాన్ బాబర్, ఇతరులను డిసెంబర్ 2024లో, బంగ్లాదేశ్ హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ ఘటనలో హసీనా తృటిలో తప్పించుకున్నారు. 24 మంది మరణించారు.ః
Also Read
- TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
- Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
- Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
- Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Read Also: Ireland vs Oman: ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఒమన్
ఇక బీఎన్పీ నేత అబ్దుస్ సలాం పింటు భారత్ దృష్టిలో చాలా ముఖ్యం. ఇతడికి కూడా యూనస్ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 2006లో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని కోర్టు ఆవరణలో, 2007లో అజ్మీర్ షరీఫ్ దర్గాలో మరియు 2011లో ఢిల్లీలో జరిగిన పేలుళ్లతో సహా భారతదేశంలో జరిగిన దాడులకు వెనుక ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామి (హుజీ)కి పింటు మద్దతు ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. పింటు 2 లక్షల ఓట్ల తేడాతో గెలిచాడు.
మూడో వ్యక్తి ఏటీఎం అజరుల్ ఇస్లాం, దీర్ఘకాలికంగా జమాత్ పార్టీలో పనిచేస్తున్నాడు. 1971 విముక్తి యుద్ధంలో 1200 మందికి పైగా మరణాలు, 13 అత్యాచార కేసులో ఇతను నిందితుడు. 2014లో ఇతడికి మరణశిక్ష విధించారు. యూనస్ సర్కార్ ఇతడిని కూడా నిర్దోషిగా విడుదల చేసింది. ఇవన్నీ ఒక వైపు ఉంచితే, ప్రస్తుతం తారిఖ్ రెహ్మాన్ బంగ్లా ప్రధాని కాబోతున్నారు. భారత్ సంబంధాల దృష్ట్యా ఇతని ఎన్నిక కీలకంగా మారింది. రానున్న కాలంలో భారత్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!