Ayodhya Rama: అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. చేనేత కార్మికులకు చేతినిండా పని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Rama: ‘బనారాసి చీరలు’ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఈనెల (జనవరి 22న) అయోధ్య రామమందిరాన్ని ప్రారంభం కానుండటంతో.. బనారసీ చీరలకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయి. ఎందుకు అనుకుంటున్నారా. రాముడి బాల్యం నుంచి రావణ సంహారం వరకు బనారసీ చీరలో అన్ని ముఖ్యమైన అంశాలు ముద్రించి వేయాలని నేత కార్మికులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డర్ ఇచ్చేవారు చీర అంచులపై శ్రీరామ నామాలు ఉండేలా చూడాలన్నారు. ఒక్కో చీర సగటు ధర రూ.7 వేల నుంచి రూ.లక్ష ఉంటుంది. అయితే ఈ చీరను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ తరహా చీరల తయారీకి ఆర్డర్లు వస్తున్నాయని వారణాసిలోని ముబారక్ పూర్ కంపెనీకి చెందిన చేనేత కార్మికుడు అనిసూర్ రెహమాన్ తెలిపారు. జనవరి 22న, ఇలాంటి చీరలు ధరించి, వారి మహిళలు తమ ప్రాంతాల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారని రెహమాన్ తెఇపారు. మరో చేనేత కార్మికుడు మదన్ కంపెనీ మాట్లాడుతూ.. బనారసీ చీర పల్లుపై రామదర్బార్ ఫోటో ఉండాలని అమెరికా నుంచి రెండు ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇలాంటి ఆదేశాలతో వారణాసిలో ‘బనారాసి చీరలు’ నేసే చేనేత కార్మికులు చేతినిండా పని వచ్చి ఫుల్ బిజీ అయ్యామని తెలిపారు. రామ మందిరం నిర్మాణం, ప్రారంభం సందర్భంగా చేనేత కార్మికులందరికి చేతినిండా పని ఉందని అన్నారు. ఇదంతా ఆరాముడి లీల అన్నారు.
Read also: CM Revanth Reddy: యశోద ఆస్పత్రిలో సీఎం.. వెంకట్రెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
మరోవైపు ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభం కానుంది. ఈ వేడుక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి బహుమతులు అందుతున్నాయి. అందులో భాగంగానే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య రామాలయానికి పంపనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. లక్ష శ్రీవారి లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. తిరుమలలోని పోటులో ఈ లడ్డూలను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేస్తోంది. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు. అయితే అయోధ్యకు వచ్చే భక్తులకు లక్ష లడ్డూలను ఉచితంగా అందించనున్నారు. త్వరలో ఈ లడ్డూలు అయోధ్యకు చేరుకోనున్నాయి. ఇక తెలంగాణ నుంచి అయోధ్య రామ మందిరానికి 118 తలుపులు దారి. హైదరాబాద్లోని బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి రామ్కి రెండు జతల బంగారు పాదుకలను కూడా రాబోతున్నాయి. హైదరాబాద్ సిటీకి చెందిన అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ దాదాపు రూ. 1.03 కోట్ల విలువైన బంగారు పాదుకలను హైదరాబాద్ నగరానికి చెందిన అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ అందిస్తుంది. కాగా.. ఈ పాదుకలను 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు ఎంతో వైవిధ్యంగా రూపొందించారు.
Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి