Zeeshan Siddique: ఎన్సీపీ గూటికి బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్
- ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్..
- కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అజిత్ పవార్..
- వాండ్రే ఈస్ట్ నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్న జీషన్ సిద్ధిఖీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zeeshan Siddique: మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జిశాన్ సిద్ధిఖీ కూడా ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో టికెట్ దక్కకపోవడంతో అజిత్ పవార్ వర్గంలో చేరినట్లుగా తెలుస్తుంది. ఎన్సీపీ తరపున బాంద్రా ఈస్ట్ నుంచి జీషన్ను బరిలోకి దింపుతున్నట్లుగా ఎన్సీపీ అజిత్ వర్గం వెల్లడించింది.
Read Also: Adilabad: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు.. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర ఎంతంటే..
Also Read
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
ఇక, గతంలో జీషన్ కాంగ్రెస్ టికెట్పై వాండ్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ను పార్టీ బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అతడికి టికెట్ రాకపోవడంతో.. ఎన్సీపీ పవార్ వర్గంలో చేరాడంతోప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పార్టీలో చేరిన తర్వాత జీషన్ మాట్లాడుతూ.. నాకు, నా ఫ్యామిలికీ ఇది ఎంతో ముఖ్యమైన రోజు.. మేము కష్టంలో ఉన్నప్పుడు మావెంట ఉండి ధైర్యం చెప్పిన అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. ఇక, బాంద్రా నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నా.. ఇక్కడి ప్రజల ప్రేమ, సపోర్టుతో మళ్లీ విజయం సాధిస్తాను అని నమ్ముతున్నాను అన్నారు.
Read Also: KA Trailer: ‘క’ ట్రైలర్ విడుదల.. అంచనాలు పెంచేలా, ఆసక్తిరంగా..!
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్సీపీ పవార్ వర్గం అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులోనూ బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్కు బాంద్రా స్థానం నుంచి టికెట్ కేటాయించినట్లుగా పేర్కొనింది. ఎన్సీపీ పార్టీ అధినేత అజిత్ పవార్ అతడి కుటుంబానికి కంచుకోట అయిన బారామతి స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 20న ఒకే దఫాలో పోలింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే, శివసేన, ఎన్సీపీ పార్టీల చీలిక తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
-
Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
-
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?