Site icon NTV Telugu

Baba Ramdev: ఐదు సార్లు నమాజ్ చేస్తారు.. ఆ తరువాత హిందూ యువతులను కిడ్నాప్ చేస్తారు..

Baba Ramdev

Baba Ramdev

Baba Ramdev: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముస్లిలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, హిందూ యువతను అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు ప్రజలను మతం మార్పిడి చేయడం వంటి ఏకైక అజెండాతో పనిచేస్తున్నాయని అన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో గురువారం జరిగిన మతపరమైన సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరిని విమర్శించడం లేదని.. ప్రపంచాన్ని ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మార్చాలని వారు నిమగ్నం అయి ఉన్నారని అన్నారు.

Read Also: ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూత

ఉగ్రవాదం వంటి నేరాలకు పాల్పడి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసి పాపాలు తొలగిపోతాయని అనుకుంటున్నారని.. క్రైస్తవ మతంలో చర్చిలో కొవ్వత్తి వెలిగించి పాపాలు తొలగిపోతాయని అనుకుంటున్నారని.. అయితే హిందూ మతంలో అలాంటిదేం లేదని అన్నారు. ‘‘ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసి, ఆ తర్వాత మనసుకు వచ్చిన పాపం చేస్తారు.. హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు.. టెర్రరిస్టులుగా మారతారు, మన ముస్లిం సోదరులు చాలా పాపాలు చేస్తారు కానీ వారు ఖచ్చితంగా నమాజ్ చేస్తారు. అలా చేయడం వారికి నేర్పించబడింది’’ అని ఆ సభలో ఆరోపించారు.

ముస్లింలు ఎలాంటి దుస్తులు ధరిస్తారనే దానిపై కూడా వ్యాఖ్యలు చేశారు. వారికి స్వర్గం అంటే చీలమండలం మీద వరకు పైజామా ధరించడం, మీసాలు కత్తిరించడం, టోపీలు ధరించడం అని.. అయితే ఖురాన్, ఇస్లాం ఇలా చేయమని చెప్పిందని నేను అనడం లేదని అననారు. కానీ ప్రజలు అలా చేస్తున్నారని పేర్కొన్నారు.

Exit mobile version