Amit Shah: జనవరి 1, 2024కి రామమందిరం సిద్ధం.. అమిత్ షా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya’s Ram Mandir Will Be Ready By Jan 1, 2024- Amit Shah’s Big Announcement: అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 1, 2024కి రామ మందిరం సిద్ధం అవుతుందని ప్రకటించారు. బీజేపీ ‘జన్ విశ్వాస్ యాత్ర’ త్రిపురలో ప్రారంభించిన అమిత్ షా ఈ ప్రకటన చేశారు. త్రిపురలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ తన ప్రచారాాన్ని ప్రారంభించింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ టార్గెట్ గా అమిత్ షా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ రాహుల్ బాబా వినండి.. నేను రామ మందిరం తెరవడానికి తేదీలు ప్రకటిస్తున్నాను’’ అంటూ జనవరి 1, 2024 నాటికి అయోధ్య రామమందిరం సిద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
Read Also: Viral : సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోన్న ఆరేళ్ల క్యాన్సర్ చిన్నారి కథనం
Also Read
హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతోంది. 2019, నవంబర్ నెలలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రామ మందిర వివాదానికి ముగింపు పలికింది. మెజారిటీ వర్గాలని అనుకూలంగా ఏకగ్రీవంగా తీర్పును వెల్లడించింది. అదే సమయంలో వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని సూచించింది. ఆగస్టు 5, 2020న రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చూస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దేవీదేవతా విగ్రహాలను ప్రతిష్టించిన తర్వాత 2024 జనవరిలో భక్తుల కోసం తెరుస్తానమని ట్రస్ట్ వెల్లడించింది
రామ మందిరం ప్రత్యేకతలు:
మహోన్నతమైన రామ మందిర నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఆలయ విస్తీర్ణంలో 2.77 ఎకరాల్లో గ్రానైట్ రాళ్లను వినియోగిస్తున్నారు. ఆలయంలో మొత్తం 392 స్తంబాలు ఉంటాయిన.. దాదాపుగా 12 ద్వారాలను నిర్మించనున్నట్లు సమాచారం. గర్భగుడిలో 160 స్తంభాలు, మొదటి అంతస్తులో 132 స్తంభాలు ఉంటాయి. ఆలయాన్ని భూకంపాలు కూడా ఏం చేయలేని విధంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!