Ram Mandir: రామమందిర విరాళాల పేరుతో మోసం.. వీఐపీ పాస్ అంటే బీ అలెర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir Ceremony SCAMs: భారతదేశంలో, ఏ విషయం ఎక్కువగా చర్చించబడుతుందో, దాని పేరుతో మోసాలు చేయడం మొదలు పెడతారు కేటుగాళ్లు. ప్రస్తుతం అయోధ్య రామ మందిరం గురించి దేశం మొత్తం చర్చ జరుగుతోంది. రామ మందిరం కోసం ప్రజలు విరాళాలు కూడా ఇస్తున్నారు. అంతేకాదు జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు కానీ సామాన్యులను ఆరోజు మాత్రం అనుమతించడం లేదు. జనవరి 22న, ఆహ్వానం అందుకున్న అతి తక్కువ మంది వ్యక్తులు మాత్రమే అయోధ్యకు వెళ్లగలరు. ఈ క్రమంలో సైబర్ కేటుగాళ్లు రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం రామాలయంలో విరాళాలు, ప్రసాదం, వీఐపీ పాస్లను ఎర చూపిస్తూ అనేక రకాల మోసాలు చేస్తున్నారు.
Battery Tips: ఈ ఐదు పనులు చేస్తే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.. జరజాగ్రత్త!
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
జనవరి 22న అయోధ్యలో ప్రవేశించేందుకు వీఐపీ పాస్లు వాట్సాప్లో షేర్ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పాస్లను అడ్మినిస్ట్రేషన్ పంపడం లేదు, సైబర్ కేటుగాళ్లు పంపుతున్నారు. వాట్సాప్లో పంపబడుతున్న సందేశం ప్రకారం, “జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి మీరు VIP పాస్ను పొందుతున్నారు; అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయడం ద్వారా VIP పాస్ను డౌన్లోడ్ చేసుకోండి.” అని అంటూ చాలా మందికి వాట్సాప్లో సేవ్ చేయమని సందేశం వచ్చింది. ఈ పాస్ని చూపడం ద్వారా, మీరు జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అనుమతించబడతారు. అని అంటూ ఆ సందేశంతో పాటు, యాప్ APK ఫైల్ కూడా పంపుతున్నారు. ఉచిత VIP పాస్ కోసం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని ప్రజలను కోరుతున్నారు. నిజానికి, హ్యాకర్లు ఈ APK ఫైల్ ద్వారా మీ ఫోన్లో మాల్వేర్ను ఇన్స్టాల్ చేయడానికి యత్నిస్తున్నారు. మాల్వేర్ ఇన్స్టాల్ చేయబడిన తర్వాత, వారు మీ ఫోన్ను రిమోట్గా పూర్తిగా నియంత్రించగలరు. ఆ తర్వాత వారు మీ బ్యాంక్ ఖాతాలు కూడా ఖాళీ చేయచ్చు.
ఇదొక ఎత్తు అయితే రామాలయం పేరుతో చాలా పేజీలు సోషల్ మీడియాలో యాక్టివ్గా మారాయి. ఒక పేజీలో QR కోడ్ కూడా షేర్ చేసి వ్యక్తుల నుండి విరాళాలు అడుగున్నారు. దీంతో సోషల్ మీడియా ద్వారా రామమందిరం పేరుతో విరాళాలు ఇవ్వకండని నిపుణులు చెబుతున్నారు. ఇక రామాలయంలో ప్రతిష్ఠాపన తర్వాత మీ ఇంటికి ప్రసాదాన్ని అందజేస్తామని పేర్కొంటున్న అనేక వెబ్సైట్లు కూడా గుర్తించబడ్డాయి. ఈ సైట్లు కూడా ప్రసాద్ కోసం బుకింగ్స్ తీసుకుంటున్నాయి. ఖాదీ ఆర్గానిక్ పేరుతో అలాంటి సైట్ ఒకటి ఉంది. ఈ సైట్ ప్రజల ఇళ్లకు ప్రసాదాన్ని అందజేస్తానని చెబుతూ డబ్బు వసూలు చేస్తోంది. సో అలెర్ట్ గా లేకుంటే జేబులు గుల్ల కావడం ఖాయం.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!