Atrocity on the Girl: దేశ రాజధానిలో 11 ఏళ్ల బాలికపై దారుణం.. టాయిలెట్లోకి లాక్కెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocity on the Girl: దేశ రాజధానిలో 11ఏళ్ల బాలికపై దారుణం చోటుచేసుకుంది. ఓ కేంద్రీయ విద్యాలయంలో పొరపాటు వెళుతూ ఇద్దరు సీనియర్లను ఆబాలిక ఢీకొట్టడంతో.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఆఘటనపై టీచర్కు ఆబాలిక తెలిపిన సంస్థ నిర్వహకులు ఈఘటనను బయటకు రాకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించడంతో ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
జూలైలో తనపై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక ఆరోపించింది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. తన తరగతి గదికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు 11, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలను ఢీకొట్టింది. తాను అబ్బాయిలకు క్షమాపణలు చెప్పానని, అయితే వారు తనను దుర్భాషలాడి వాష్రూమ్లోకి తీసుకెళ్లారని బాలిక తెలిపింది. బాలురు వాష్రూమ్కి లోపలి నుంచి తాళం వేసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
Also Read
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
- N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా?
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
బాధితురాలు మాట్లాడుతూ, ఈ సంఘటన గురించి ఉపాధ్యాయుడికి తెలియజేసినప్పుడు, అబ్బాయిలను బహిష్కరించినట్లు చెప్పారని దీనిపై ఎక్కడా మాట్లాడొద్దని టీచర్ చెప్పినట్లు తెలిపింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్.. పోలీసులకు, ప్రిన్సిపాల్కు విడివిడిగా నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ కాపీని, ఈ కేసులో చేసిన అరెస్టుల వివరాలను అందించాలని కమిషన్ ఢిల్లీ పోలీసులను కోరింది. ఈ విషయాన్ని పోలీసులకు నివేదించనందుకు పాఠశాల ఉపాధ్యాయుడు లేదా ఇతర సిబ్బందిపై తీసుకున్న చర్యల గురించి సమాచారం అందించాలని ఢిల్లీ పోలీసులు, పాఠశాల అధికారులను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ కోరింది.
తన పాఠశాల ఉపాధ్యాయుడు విషయాన్ని దాచడానికి ప్రయత్నించాడని బాలిక ఆరోపించడంతో.. ఈ విషయం పాఠశాల అధికారులకు ఎప్పుడు తెలిసింది? వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తెలియజేయాలని కమిషన్ పాఠశాల ప్రిన్సిపాల్ను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ కోరింది. ఈ విషయంలో నిర్వహించిన విచారణ నివేదిక కాపీని అందించాలని కూడా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ పాఠశాలను కోరింది. ,” అని DCW అధికారి తెలిపారు. దేశ రాజధానిలో పిల్లలకు పాఠశాలలు కూడా సురక్షితం కాకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. పాఠశాల అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలి’’ అని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఆదేశించింది.
అయితే.. స్కూల్ వర్గాలు మాత్రం.. బాధిత బాలికగానీ.. ఆమె తల్లిదండ్రులు గానీ ఈ విషయాన్ని తమ దృష్టికి తేలేదని.. పేరెంట్ మీటింగ్లో కూడా ఈ దారుణం గురించి చెప్పలేదని పోలీసులు విచారణకు వచ్చినప్పుడే విషయం తెలిసిందని అంటున్నారు.
सरकारी स्कूल में 11 साल की बच्ची के साथ हुए दुष्कर्म के मामले में दिल्ली महिला आयोग अध्यक्ष @SwatiJaiHind ने दिल्ली पुलिस और स्कूल प्रशासन को भेजा नोटिस। pic.twitter.com/3fVXOTOggn
— Delhi Commission for Women – DCW (@DCWDelhi) October 6, 2022
తాజావార్తలు
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?