Atrocity on the Girl: దేశ రాజధానిలో 11 ఏళ్ల బాలికపై దారుణం.. టాయిలెట్లోకి లాక్కెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocity on the Girl: దేశ రాజధానిలో 11ఏళ్ల బాలికపై దారుణం చోటుచేసుకుంది. ఓ కేంద్రీయ విద్యాలయంలో పొరపాటు వెళుతూ ఇద్దరు సీనియర్లను ఆబాలిక ఢీకొట్టడంతో.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఆఘటనపై టీచర్కు ఆబాలిక తెలిపిన సంస్థ నిర్వహకులు ఈఘటనను బయటకు రాకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించడంతో ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
జూలైలో తనపై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక ఆరోపించింది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. తన తరగతి గదికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు 11, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలను ఢీకొట్టింది. తాను అబ్బాయిలకు క్షమాపణలు చెప్పానని, అయితే వారు తనను దుర్భాషలాడి వాష్రూమ్లోకి తీసుకెళ్లారని బాలిక తెలిపింది. బాలురు వాష్రూమ్కి లోపలి నుంచి తాళం వేసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
Also Read
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
బాధితురాలు మాట్లాడుతూ, ఈ సంఘటన గురించి ఉపాధ్యాయుడికి తెలియజేసినప్పుడు, అబ్బాయిలను బహిష్కరించినట్లు చెప్పారని దీనిపై ఎక్కడా మాట్లాడొద్దని టీచర్ చెప్పినట్లు తెలిపింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్.. పోలీసులకు, ప్రిన్సిపాల్కు విడివిడిగా నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ కాపీని, ఈ కేసులో చేసిన అరెస్టుల వివరాలను అందించాలని కమిషన్ ఢిల్లీ పోలీసులను కోరింది. ఈ విషయాన్ని పోలీసులకు నివేదించనందుకు పాఠశాల ఉపాధ్యాయుడు లేదా ఇతర సిబ్బందిపై తీసుకున్న చర్యల గురించి సమాచారం అందించాలని ఢిల్లీ పోలీసులు, పాఠశాల అధికారులను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ కోరింది.
తన పాఠశాల ఉపాధ్యాయుడు విషయాన్ని దాచడానికి ప్రయత్నించాడని బాలిక ఆరోపించడంతో.. ఈ విషయం పాఠశాల అధికారులకు ఎప్పుడు తెలిసింది? వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తెలియజేయాలని కమిషన్ పాఠశాల ప్రిన్సిపాల్ను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ కోరింది. ఈ విషయంలో నిర్వహించిన విచారణ నివేదిక కాపీని అందించాలని కూడా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ పాఠశాలను కోరింది. ,” అని DCW అధికారి తెలిపారు. దేశ రాజధానిలో పిల్లలకు పాఠశాలలు కూడా సురక్షితం కాకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. పాఠశాల అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలి’’ అని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఆదేశించింది.
అయితే.. స్కూల్ వర్గాలు మాత్రం.. బాధిత బాలికగానీ.. ఆమె తల్లిదండ్రులు గానీ ఈ విషయాన్ని తమ దృష్టికి తేలేదని.. పేరెంట్ మీటింగ్లో కూడా ఈ దారుణం గురించి చెప్పలేదని పోలీసులు విచారణకు వచ్చినప్పుడే విషయం తెలిసిందని అంటున్నారు.
सरकारी स्कूल में 11 साल की बच्ची के साथ हुए दुष्कर्म के मामले में दिल्ली महिला आयोग अध्यक्ष @SwatiJaiHind ने दिल्ली पुलिस और स्कूल प्रशासन को भेजा नोटिस। pic.twitter.com/3fVXOTOggn
— Delhi Commission for Women – DCW (@DCWDelhi) October 6, 2022
తాజావార్తలు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
-
Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!