Himanta Biswa Sarma: హిందూ అమ్మాయిలు ఎమోషనల్.. “లవ్ జీహాద్”పై కఠిన చట్టం అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam CM Himanta Biswa Sarma’s key comments on Shraddha’s case: ఢిల్లీ శ్రద్దా వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతుకోసి చంపేశాడు. మే నెలలో జరిగిన ఈ దారుణహత్య, శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో గత వారం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి, 18 రోజుల పాటు రోజూరాత్రి ఢిల్లీ సమీపంలోని ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో పారేసినట్లు నిందితుడు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు.
ఇదిలా ఉంటే ఈ హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీకి చెందిన పలువురు నేతలు శ్రద్ధా మరణాన్ని ‘‘లవ్ జీహాద్’’గా అభివర్ణిస్తున్నారు. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, శ్రద్ధా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రద్ధావాకర్ మరణాన్ని ‘లవ్ జీహాద్’ అని అన్నారు. అఫ్తాబ్, శ్రద్ధాను చంపి 35 ముక్కులుగా నరికాడని.. శ్రద్ధాను పెళ్లి పేరుతో ముంబై నుంచి ఢిల్లీ తీసుకెళ్లాడని.. పెళ్లి చేసుకోలేదని, అయితే శరీరాన్ని ముక్కలుగా చేసి శరీరాన్ని ఫ్రిజ్ లో పెట్టాడని అన్నారు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: Madras Eye: తమిళనాడును కలవరపెడుతున్న “మద్రాస్ ఐ” .. ప్రతిరోజూ 4 వేలకు పైగా కేసులు
అయితే హిందూ అమ్మాయినే ఎందుకు తీసుకువచ్చావని పోలీసులు అడిగితే.. వారు ఎమెషనల్ కాబట్టే ఇలా చేశానని అఫ్తాబ్ చెప్పాడని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇది ఒక్క కేసే కానది.. ఇలాంటి అఫ్తాబ్-శ్రద్ధాలు దేశవ్యాప్తంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకూడదంటే.. ‘లవ్ జీహాద్’పై కఠిన చట్టాలు తీసుకురావాలని, ఇది కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.
శ్రద్ధా హత్య కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. శ్రద్ధాకు సంబంధించిన ఎముకలు, అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపు ఆనవాళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబుకు డీఎన్ఏ పరీక్ష కోసం పంపారు. నిందితుడు అఫ్తాబ్ కు నార్కో పరీక్షలకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. మరో కొన్ని రోజుల్లో డీఎన్ఏ ఫలితాలు రానున్నాయి. ఈ డీఏఎన్ఏ శ్రద్ధా తండ్రితో సరిపోలితే.. కేసు మరింత బలపడే అవకాశం ఉంది.
#WATCH | Gujarat: Aftaab killed Shardha & chopped her body into 35 pieces. When police asked why he brought only Hindu girls he said he did it because they're emotional.There're other Aftaab-Shradha too,country needs strict law against 'Love Jihaad': Assam CM HB Sarma in Dhansura pic.twitter.com/5PEc7HsvVh
— ANI (@ANI) November 22, 2022
తాజావార్తలు
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..