Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- ధర్మాన్ని గెలిపించేందుకు శ్రీకృష్ణుడు అమలు చేసిన ఐదు కీలక యుద్ధ వ్యూహాలు.
- ద్రోణాచార్యుడి మరణం నుంచి భీష్ముడి పతనం వరకు కీలక మలుపులు.
- అభిమన్యుడి వీరమరణం, జయద్రథుడి వధ యుద్ధ గమనాన్ని మార్చిన ఘటనలు.
- కర్ణుడి దానగుణం, శిఖండి పాత్ర మహాభారతంలో ప్రత్యేక స్థానం పొందాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabharata: మహాభారతం ఒక యుద్ధం మాత్రమే కాదు. మనిషి ఎలా ప్రవర్తించకూడదని చెప్పే ఒక గ్రంథం. ధర్మాలు, పాపాలు, తప్పులు, నైతికత, రాజకీయాలు, ప్రేమ, ప్రతీకారం ఇలా ప్రతీ క్యారెక్టర్కు ఒక్కో లక్షణం ఉంటుంది. ఈ ఇతిహాసంలో అనేక మలుపులు, ధర్మం గురించి క్లియర్ విశ్లేషణ ఉంటుంది. ఇక కురుక్షేత్ర యుద్ధం కేవలం యుద్ధంగా మాత్రమే పరిగణించలేము. ఆధునిక యుద్ధాలకు కావాల్సిన రాజనీతిని, వ్యూహాలను ఇప్పటికీ ఇస్తుంది. ఈ యుద్ధంలో ద్రోహాలు, మోసాలకు కూడా కొదువలేదు. స్వయంగా శ్రీకృష్ణుడి అంతటి వాడే, కొన్ని చర్యల ద్వారా కౌరవుల పక్షాన్ని మాయ చేసి, యుద్ధంలో గెలుపుకు పునాది వేశాడు. ఇప్పటికీ, కృష్ణుడు చేసిన ఈ సంఘటనలు విమర్శలకు గురవుతూనే ఉన్నాయి. కానీ, ఇక్కడ అంతరార్థం మాత్రం ‘‘శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ’’, ధర్మాన్ని ఎలాగైనా గెలిపించే ప్రయత్నంగానే చూడాలి.
1) ద్రోణాచార్యుడి మరణం:
గురువు ద్రోణాచార్యుడి మరణం మహాభారతంలో నేలకొరిగిన ఒక యోధుడిని గురించి తెలుపుతుంది. అప్పటి వరకు అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూ పాండవ పక్షాన్ని ఓడిస్తున్న ద్రోణాచార్యుడిని ఒక్క అబద్ధం బలితీసుకుంది. ద్రోణుడికి తన కుమారుడి అశ్వత్థామపై చాలా ప్రేమ. ఈ ప్రేమే చివరకు ద్రోణుడి మరణానికి కారణమైంది. కృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు .. ‘‘ అశ్వత్థామ హత:’’ అని పెద్దగా చెప్పి ‘‘కుంజర:(ఏనుగు)’’ గురించి మెల్లిగా చెబుతాడు. అబద్ధం ఆడలేని ధర్మరాజు అశ్వత్థామ అనే పేరున్న ఏనుగు మరణించిందని ద్రోణుడికి చెబుతాడు. ఈ అర్ధసత్యం ద్రోణాచార్యుడిని కుదిపేసింది. అతను తన ఆయుధాలను విడిచిపెట్టి ధ్యానంలోకి వెళ్ళాడు. అదే క్షణంలో ధృష్టద్యుమ్నుడు అతన్ని సంహరించాడు. ఈ సంఘటన మహాభారతంలోని గొప్ప మలుపుగా అభివర్ణించబడుతుంది.
Also Read
- Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Lunar Eclipse 2026: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
2) చక్రవ్యూహం, అభిమన్యుడి హత్య:
అర్జునుడి కుమారుడు అభిమన్యుడి యుద్ధానికి కౌరవ సేన అతలాకుతలం అయింది. కేవలం యవ్వన ప్రాయంలో ఉన్న అభిమణ్యుడు చేస్తున్న యుద్ధాన్ని గురువులు ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు వంటి పెద్ద యోధులు కూడా తట్టుకోలేకపోయారు. చక్రవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడి ధాటికి ఆ రోజే కురక్షేత్ర యుద్ధం ముగిసి, పాండవులు గెలిచే స్థాయికి వెళ్లింది. అయితే, యుద్ధ నియమాలు ఉల్లంఘించి, ఒంటరిగా ఉన్న అభిమన్యుడిపైకి కౌరవసేన మూకుమ్మడిగా దాడి చేయడం, వెనక నుంచి కర్ణుడు దెబ్బతీయడంతో మరణిస్తారు. మహాభారతంలో అత్యంత క్రూరమైన హత్యగా దీనిని పరిగణిస్తారు.
3) జయద్రధుడి వధ:
అభిమన్యుడి మరణం తర్వాత, మరుసటి రోజు సూర్యాస్తమయం లోగా జయధ్రదుడిని చంపుతానని, లేదంటే తనే అగ్నిలోకి దూకి చనిపోతానని అర్జునుడు శపథం చేస్తాడు. జయధ్రదుడిని రక్షించేందుకు కౌరవసేన యుద్ధానికి చాలా దూరంలో అతడిని ఉంచుతుంది. సూర్యస్తమయం సమీపిస్తున్న అతడి జాడను అర్జునుడు కనుక్కోలేకపోతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుడికి కప్పే్స్తాడు. చీకటి పడటంతో తన ప్రాణాలకు ప్రమాదం లేదని భావించిన జయద్రధుడు ఒక్కసారిగా దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటాడు. ఆ సమయంలో సుదర్శన చక్రం తప్పుకోవడంతో సూర్యుడి వెలుగు బయటకు వస్తుంది. సరిగా అదే క్షణంలో అర్జునుడు అతడిని సంహరిస్తాడు.
4) కర్ణుడి కవచకుండలాలు దానం:
సూర్యుడి కుమారుడి కర్ణుడుకి ఉన్న దివ్యమైన కవచాలు, చెవిపోగుల్ని ఇంద్రుడికి దానంగా ఇస్తాడు. కర్ణుడు అర్జునుడిని ఓడిస్తాడనే భయంతో ఇంద్రుడు ఇలా వరం కోరారని చెబుతుంటారు. కానీ, సాధనకు దేవుడిగా ఉన్న ఇంద్రుడు కర్ణుడిని పరీక్షించడానికి దానాన్ని కోరుతాడని మహర్షులు చెబుతుంటారు. ఇలా దానం అడిగే విషయాన్ని సూర్యుడు ముందుగానే కర్ణుడికి కవచకుండలాలు ఇవ్వొద్దని చెబుతాడు. ఇంద్రుడు దానం అడగడంతో తన కవచకుండలాను కర్ణుడు దానంగా ఇస్తాడు, దీనికి ప్రతిఫలంగా ఇంద్రుడు అత్యంత శక్తివంతమైన ‘‘శక్తి అస్త్రాన్ని’’ కర్ణుడికి ఇస్తాడు. ఇదే అస్త్రాన్ని కర్ణుడు ఘటోత్కచుడిపై వాడి సంహరిస్తాడు. నిజానికి ఈ అస్త్రాన్ని కర్ణుడు అర్జునుడి కోసం వాడాలని అనుకుంటాడు. చివరకు ఘటోత్కచుడి విధ్వంసాన్ని ఆపేందుకు ఇలా వాడాల్సి వస్తుంది.
5) భీష్మ పితామహుడు-శిఖండి యుద్ధం:
భీష్ముడికి ఇచ్చాపూర్వక మరణం అనే వరం ఉంటుంది. తాను కోరుకున్నప్పుడే మరణించే వరం ఉంది. అయితే, అతడిని సంహరించేందుకు అంబనే శిఖండి రూపంలో, శివుడి వరాన్ని పొంది భీష్ముడిని చంపేందుకు వస్తుంది. ద్రుపదుడి కుమార్తెగా జన్మించి, ఆ తర్వాత పురుషుడిగా మారి భీష్ముడిని చంపుతాడు. అంబ పూర్వ జన్మ గురించి భీష్ముడికి ముందే తెలుసు. దీంతో శిఖండి పైకి ఆయుధాలు ఎక్కుపెట్టలేదు. చివరకు అర్జునుడి శిఖండి వెనక నుంచి బాణాలు వేసి భీష్ముడు కింద పడిపోయేలా చేస్తాడు.
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!