MIM vs BJP: హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందన్న ఓవైసీ.. హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ కౌంటర్
- హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందన్న అసదుద్దీన్ ఓవైసీ..
- ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ..
- భారత్ హిందూ దేశం, ప్రధానిగా ఎప్పటికీ హిందువే అవుతాడు: హిమంత శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MIM vs BJP: హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు భారత ప్రధాని కావాలని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ కామెంట్స్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే, శనివారం నాడు మహారాష్ట్రలోని సోలాపూర్లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఓవైసీ.. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒకే మతానికి చెందిన వ్యక్తే అక్కడ ప్రధాని అవుతాడు.. కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం భారత పౌరుడు ఎవరైనా సరే ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చు అని గుర్తు చేశారు. ఇక, హిజాబ్ ధరించిన మహిళా ఈ దేశానికి ప్రధాని అయ్యే రోజు రావాలని నేను కలలు కంటున్నాను అని అసదుద్దీన్ పేర్కొన్నారు.
Read Also: The Rajasaab : ఓల్డ్ రాజాసాబ్ వచ్చేసాడు.. థియేటర్లు ఫుల్ చేశాడు
Also Read
- PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
- Sugar Price: సామాన్యులకు గుడ్న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
ఇక, ఎంపీ ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. రాజ్యాంగపరంగా ఎవరికీ ప్రధాని కావడంలో అడ్డంకి లేదు.. కానీ భారతదేశం ఒక హిందూ దేశం, హిందూ నాగరికత.. అందుకే భారత ప్రధాని ఎప్పటికీ హిందువే అవుతాడనే విశ్వాసం మాకు ఉందని తెలిపాడు. అలాగే, ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావల్లా మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందంటూ ఓవైసీ చెబుతున్నారు.. రాజ్యాంగం ఎవరికీ అడ్డంకి కాదు.. కానీ, ముందు AIMIM పార్టీలోనే ఒక పస్మాందా లేదా హిజాబ్ ధరించిన మహిళను అధ్యక్షురాలిగా చేయండి అంటూ ఎక్స్ (X)లో సవాల్ విసిరారు.
Read Also: Parvathy : చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. ఆ నొప్పితో కుంగిపోయా..స్టార్ హీరోయిన్
ఇక, హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఆయన తలలో ట్యూబ్లైట్ ఉంది.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, రాజ్యాంగంలో లేని మాటలు ఎలా మాట్లాడతారు? అని విమర్శించారు. ఈ దేశం ఒక్క వర్గానికే చెందిందని అనుకునేవారు రాజ్యాంగ ఆత్మను అర్థం చేసుకోలేకపోతున్నారు.. దేవుడిని నమ్మని వారికీ ఈ దేశంలో స్థానం ఉంది.. అదే భారతదేశ సౌందర్యం.. హిమంత మనస్సు చిన్నపిల్లల మనస్తత్వం అని విమర్శించారు. అయితే, ఇరువురి వ్యాఖ్యలతో ముంబై మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మరింత హీటెక్కింది. ఈ ఎన్నికలు జనవరి 15వ తేదన జరగనుండగా, ఫలితాలు జనవరి 16న వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!