MIM vs BJP: హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందన్న ఓవైసీ.. హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ కౌంటర్
- హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందన్న అసదుద్దీన్ ఓవైసీ..
- ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ..
- భారత్ హిందూ దేశం, ప్రధానిగా ఎప్పటికీ హిందువే అవుతాడు: హిమంత శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MIM vs BJP: హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు భారత ప్రధాని కావాలని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ కామెంట్స్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే, శనివారం నాడు మహారాష్ట్రలోని సోలాపూర్లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఓవైసీ.. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒకే మతానికి చెందిన వ్యక్తే అక్కడ ప్రధాని అవుతాడు.. కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం భారత పౌరుడు ఎవరైనా సరే ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చు అని గుర్తు చేశారు. ఇక, హిజాబ్ ధరించిన మహిళా ఈ దేశానికి ప్రధాని అయ్యే రోజు రావాలని నేను కలలు కంటున్నాను అని అసదుద్దీన్ పేర్కొన్నారు.
Read Also: The Rajasaab : ఓల్డ్ రాజాసాబ్ వచ్చేసాడు.. థియేటర్లు ఫుల్ చేశాడు
Also Read
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
ఇక, ఎంపీ ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. రాజ్యాంగపరంగా ఎవరికీ ప్రధాని కావడంలో అడ్డంకి లేదు.. కానీ భారతదేశం ఒక హిందూ దేశం, హిందూ నాగరికత.. అందుకే భారత ప్రధాని ఎప్పటికీ హిందువే అవుతాడనే విశ్వాసం మాకు ఉందని తెలిపాడు. అలాగే, ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావల్లా మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందంటూ ఓవైసీ చెబుతున్నారు.. రాజ్యాంగం ఎవరికీ అడ్డంకి కాదు.. కానీ, ముందు AIMIM పార్టీలోనే ఒక పస్మాందా లేదా హిజాబ్ ధరించిన మహిళను అధ్యక్షురాలిగా చేయండి అంటూ ఎక్స్ (X)లో సవాల్ విసిరారు.
Read Also: Parvathy : చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. ఆ నొప్పితో కుంగిపోయా..స్టార్ హీరోయిన్
ఇక, హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఆయన తలలో ట్యూబ్లైట్ ఉంది.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, రాజ్యాంగంలో లేని మాటలు ఎలా మాట్లాడతారు? అని విమర్శించారు. ఈ దేశం ఒక్క వర్గానికే చెందిందని అనుకునేవారు రాజ్యాంగ ఆత్మను అర్థం చేసుకోలేకపోతున్నారు.. దేవుడిని నమ్మని వారికీ ఈ దేశంలో స్థానం ఉంది.. అదే భారతదేశ సౌందర్యం.. హిమంత మనస్సు చిన్నపిల్లల మనస్తత్వం అని విమర్శించారు. అయితే, ఇరువురి వ్యాఖ్యలతో ముంబై మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మరింత హీటెక్కింది. ఈ ఎన్నికలు జనవరి 15వ తేదన జరగనుండగా, ఫలితాలు జనవరి 16న వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!